అయినా అరగంట కరెంట్ పోతే కొంపలు మునిగిపోతాయా? ప్రతిపక్ష నాయకులు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇక నెల పదిహేను రోజులు పించన్లు ఆలస్యమైతే ప్రళయం వస్తుందా... బ్రహ్మాండం బద్దలవుతుందా..? అంటూ కామెంట్ చేసారు. ఇలా కరెంట్ కోతలు, ఫించన్ల ఆలస్యం నిజమే అనేలా అసెంబ్లీ వేదికగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.