
దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల పలితాల తర్వాత జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేంద్రీకరించాయి. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జానారెడ్డిని బరిలోకి దింపింది.
దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల పలితాల తర్వాత జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కేంద్రీకరించాయి. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జానారెడ్డిని బరిలోకి దింపింది.
టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది.
ఈ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కాంగ్రెస్ కు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం కంచుకోట. ఈ స్థానంలో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ ఎదురుదెబ్బలు తింది.
కాంగ్రెస్ కు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం కంచుకోట. ఈ స్థానంలో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ ఎదురుదెబ్బలు తింది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ప్రచారం చేస్తోంది.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ప్రచారం చేస్తోంది.
. అయితే తమకు ప్రత్యామ్నాయం లేదని సంకేతాన్ని పంపేందుకు సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.
. అయితే తమకు ప్రత్యామ్నాయం లేదని సంకేతాన్ని పంపేందుకు సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థానాన్ని బీజేపీ సుస్థిరం చేసుకొనేందుకు సహాయపడుతోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా ఈ విజయం ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థానాన్ని బీజేపీ సుస్థిరం చేసుకొనేందుకు సహాయపడుతోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా ఈ విజయం ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ లో నైరాశ్యాన్ని నింపాయి. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ లో నైరాశ్యాన్ని నింపాయి. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి.
నాగార్జునసాగర్ నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. గత ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.
నాగార్జునసాగర్ నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. గత ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు.
నోముల నర్సింహ్మయ్య కొడుకు నోముల భగత్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నాడు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి అంశం పనిచేయలేదు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు చేతిలో ఓటమి పాలైంది.
నోముల నర్సింహ్మయ్య కొడుకు నోముల భగత్ ఈ స్థానం నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నాడు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతి అంశం పనిచేయలేదు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు చేతిలో ఓటమి పాలైంది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేయడానికి బలమైన నేతలు లేరు. అయితే ఈ స్థానం నుండి పోటీకి బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతోందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేయడానికి బలమైన నేతలు లేరు. అయితే ఈ స్థానం నుండి పోటీకి బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతోందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.