ఇద్దరు సీఎంలు, ఓ మాజీ సీఎంతో కలిసి యాదగిరీశున్ని దర్శించుకున్న కేసీఆర్ (ఫోటోలు)
First Published Jan 18, 2023, 4:20 PM ISTయాదగిరిగుట్ట : భారత రాష్ట్ర సమితి నిర్వహించే ఖమ్మం బహిరంగ సభకోసం తెలంగాణకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎం, జాతీయ జాతీయ నాయకులు యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో డిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ నాయకుడు డి రాజా తదితరులను సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైన విజయన్, డి రాజా గెస్ట్ హౌస్ కే పరిమితమవగా మిగతా నాయకులంతా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కేసీఆర్ తో కలిసి ఆలయానికి చేరుకున్న ఇద్దరు సీఎంలు, మరో మాజీ సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి నాయకులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎంలు, మాజీ సీఎంకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసారు.