తెలంగాణలో బోనాల పండుగ ఘనంగా ప్రారంభం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు మొదలు అవుతాయి. 600 ఏళ్ల చరిత్ర గల ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిన పండుగల్లో బోనాలు ముఖ్యమైనవి. అమ్మవారికి కృతజ్ఞతగా, కుటుంబ శ్రేయస్సు కోసం మొక్కులు తీర్చే ఈ పండుగ జూన్ 26 నుంచి జులై 24 వరకు నెల రోజుల పాటు జరగనుంది. హైదరాబాద్ నగరం గోల్కొండ కోట నుంచి పాతబస్తీ వరకు భక్తిమయంగా మారింది.
26
గోల్కొండ ఎంతో విశేషం
బోనాల ఉత్సవాల్లో గోల్కొండకు ఉన్న ప్రాధాన్యం ఎంతో విశేషం. ప్రతి సంవత్సరం తొలి బోనాన్ని గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో సమర్పించడం ఆనవాయితీ. ఈ సంప్రదాయానికి సుమారు 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఏడాది జూన్ 26న మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు బోనం సమర్పించి పండుగకు శ్రీకారం చుట్టారు.
36
గోల్కొండలో ఎల్లమ్మ ఆలయం
బోనంలో పసుపు, కుంకుమ, అన్నం, గుడ్లు వంటి నైవేద్యాలు ఉంటాయి. చీరలు, పూలతో అలంకరించిన బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సంప్రదాయానికి పునాది 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకుడు తానీషా పాలనలో పడింది. ఆయన హిందూ మంత్రి మాదన్న గోల్కొండలో ఎల్లమ్మ ఆలయం నిర్మించిన తరువాత అక్కడ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
బోనాల పర్వదినాలు గోల్కొండతో ముగియవు. జులై 13న సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు, జులై 21న పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు జరుగుతాయి. జులై 24న గోల్కొండలో తిరిగి ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
ఈ పండుగ సందర్భంగా ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, బంగారు బోనాల సమర్పణ జరుగుతాయి. నగరవ్యాప్తంగా మేళతాళాలు, నాట్య రూపాలు, అమ్మవారి రథయాత్రలతో భక్తి శ్రద్ధల సందడి నెలకొంటుంది.
56
గోల్కొండ తొలి బోనం
బోనాల వేడుకలకు లక్షలాది మంది తరలివస్తారని ముందస్తుగా ట్రాఫిక్, భద్రత, నీటి సరఫరా, శుభ్రత వంటి ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. ముఖ్యంగా గోల్కొండ తొలి బోనం కార్యక్రమాన్ని లక్షలాది భక్తులు తిలకించడంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ భక్తి, చారిత్రిక, సాంస్కృతిక విలువలను ఏకకాలంలో ప్రతిబింబించే బోనాల పండుగ.. రాష్ట్ర గర్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది.
66
గోల్కొండకు ఎందుకు ఇస్తారు
ఇంతటి ప్రాధాన్యాన్ని గోల్కొండకు ఎందుకు ఇస్తారు అనే సందేహం చాలామందిలో ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే, బోనాల పండుగకు గోల్కొండ కేంద్రబిందువై ఏర్పడిన తీరుపై స్పష్టత వస్తుంది. 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకుడు అబుల్ హసన్ తానీషా పాలనలో, ఆయన మంత్రిగా ఉన్న మాదన్న అనే హిందూ కార్యదర్శి, ఎల్లమ్మ దేవిని ఆరాధిస్తూ గోల్కొండ కోటలో ఆలయాన్ని నిర్మించాడు. అదే ఆలయం నేటికీ జగదాంబిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.
తానీషా పాలన హిందూ ముస్లిం సాంప్రదాయాల కలయికగా చరిత్రకారులు పేర్కొంటారు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా మాదన్నకు మంత్రి పదవి ఇవ్వడం, గోల్కొండలో దేవాలయం నిర్మించేందుకు అనుమతి ఇవ్వడం చెప్పుకోవచ్చు. అప్పటినుండే గోల్కొండలో బోనాలు జరగడం మొదలై, మొదటి బోనం అక్కడే సమర్పించే సంప్రదాయం స్థిరపడింది.