అష్టదిగ్భంధనంలో కేసీఆర్: మంచి తరుణం మళ్లీ దొరకునా.. బీజేపీ వ్యూహాలు

First Published Oct 11, 2019, 5:25 PM IST

కేసీఆర్‌ను సరిగ్గా లాక్ చేయడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం మళ్లీ రాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిని ఢిల్లీ స్థాయిలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక సరైన సమయంలో సంధించడానికి బ్రహ్మాస్త్రం గవర్నర్ తమిళిసై ఎలాగు ఉన్నారు

తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇద్దరు ముఖ్యమంత్రులకు బాగా కావాల్సిన వ్యక్తి అయిన మేఘా కృష్ణారెడ్డి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ యజమానుల నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలకు దిగడం కార్పోరేట్, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
undefined
ఆర్టీసీ కార్మికులు తాము సమ్మె చేస్తూనే మరిన్ని వర్గాలను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీకి తెరాస మినహా తెలంగాణలోని అన్ని రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్ధతు లభిస్తోంది. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేం లేదని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నప్పటికీ ఇది రానున్న రోజుల్లో పెను సమస్యగా మారే అవకాశాలు ఉన్నట్లుగానే పరిణామాలు కనిపిస్తున్నాయి.
undefined
ఇదే సమయంలో తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ ఉపయోగించుకుంటోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర బీజేపీ నేతలు అంతెత్తున లేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికులను సైతం కేసీఆర్‌పైకి బాగా ఎగదోసేందుకు తెర వెనుక కమలనాథులు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
undefined
ఈ క్రమంలో టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా గతంలో మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సంస్థలు, ఆస్తులు, ఇళ్లపైనా ఐటీ దాడులు జరిగాయి. రోటీన్ సోదాలేనని అప్పట్లో చెప్పినప్పటికీ అనంతర కాలంలో మైహోమ్ గ్రూప్‌కి చెందిన పలువురు ఉన్నతోదోగ్యుల ఇళ్లపైనా సోదాలు కొనసాగినట్లుగా గుసగుసలు వినిపించాయి.
undefined
ఈ సంఘటన మరిచిపోతున్న తరుణంలోనే జూపల్లి రామేశ్వరరావు వ్యాపార భాగస్వామి, ఆప్తుడు మేఘా కృష్ణారెడ్డికి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీలపై ఐటీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి. వీరిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని రకాలుగా అండదండలు అందిస్తారన్నది బహిరంగ రహస్యమే. ఒక వర్గం చేతుల్లోనే తెలుగు మీడియాలోని ప్రధాన ఛానెళ్లను వీరిద్దరూ టేకోవర్ చేసి టీఆర్ఎస్ అనుకూల ఛానెళ్లుగా మార్చేశారన్న అభిప్రాయం ఉంది.
undefined
టీవీ9 కొనుగోలు వ్యవహారంలో మేఘా కృష్ణారెడ్డి, జూపల్లి రామేశ్వరరావులు కుట్రపూరితంగా వ్యవహరించారని.. బ్లాక్ మనీ, మనీలాండరింగ్ వంటి నేరాలకు పాల్పడ్డారని రవిప్రకాశ్ సీబీఐ, ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతున్నాయని తమ పేరు బయటకు రాకుండా బీజేపీ పెద్దలు జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది.
undefined
కేసీఆర్‌ను సరిగ్గా లాక్ చేయడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం మళ్లీ రాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిని ఢిల్లీ స్థాయిలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక సరైన సమయంలో సంధించడానికి బ్రహ్మాస్త్రం గవర్నర్ తమిళిసై ఎలాగు ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె, ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజులు వేచి చూసి ఈ వ్యవహారంపై తమిళిసై నేరుగా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
undefined
click me!