షియోమి స్మార్టర్ లివింగ్ ఈవెంట్ : స్మార్ట్ టి‌విలతో పాటు లేటెస్ట్ ప్రాడెక్ట్స్ లాంచ్.. అవేంటంటే ?

First Published Aug 23, 2021, 3:04 PM IST

చైనా ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమి స్మార్టర్ లివింగ్ 2020 ఈవెంట్ ఆగస్టు 26న ఇండియాలో జరగనుంది. ఈ ఈవెంట్‌ ద్వారా లేటెస్ట్ ఉత్పత్తులను ఒకేసారి ప్రవేశపెట్టనుంది. ఇందులో ఎం‌ఐ టి‌వి5ఎక్స్ కూడా ఉంది అంటే ఈ టి‌వి ఎం‌ఐ టి‌వి 4ఎక్స్ కి  అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం ఎం‌ఐ టి‌వి 4ఎక్స్ మార్కెట్లో 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాల మోడళ్లలో అందుబాటులో ఉంది. 

న్యారో బెజెల్  అండ్ మెటల్ ఫినిష్ ఎం‌ఐ టి‌వి5ఎక్స్ తో వస్తుంది. షియోమి  స్మార్టర్ లివింగ్ ఈవెంట్ ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో టీవీలతో పాటు ఎం‌ఐ బ్యాండ్ 6, ఎం‌ఐ నోట్‌బుక్‌లు కూడా లాంచ్ చేయనుంది. షియోమి ఈ ఈవెంట్ గురించి ట్వీట్  ద్వారా అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా కంపెనీ వెబ్‌సైట్‌లో ఈవెంట్ పేజీని చూడవచ్చు.

 ఎం‌ఐ బాండ్ 6 ఎస్‌పి‌ఓ2 ట్రాకింగ్‌తో పాటు 30 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుందని షియోమి ఇండియా ట్వీట్ లో తెలిపింది. అలాగే  ఎం‌ఐ నోట్ బుక్ ఎయిర్‌స్పేస్ గ్రేడ్ సిరీస్ 6 అల్యూమినియం అల్లాయ్ బాడీతో లాంచ్ చేయవచ్చు.  అయితే ఎం‌ఐ నోట్‌బుక్ పేరును అధికారికంగా ధృవీకరించలేదు కానీ దాని ఫీచర్లు రెడ్‌మిబుక్ ప్రో 15తో పోలి ఉండనుంది.

ఎం‌ఐ బ్యాండ్ 6  లుక్ ఎం‌ఐ బ్యాండ్ 5 తో సమానంగా ఉంటుంది, అయితే కొంచెం పెద్ద డిస్‌ప్లే అందించవచ్చు. ఎం‌ఐ బ్యాండ్ 6 450 నిట్స్ బ్రైట్ తో 1.56-అంగుళాల ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే, డిస్‌ప్లేపై యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. వాటర్ రిసిస్టంట్ కోసం 5ఏ‌టి‌ఎం రేటింగ్ పొందింది. ఎం‌ఐ బ్యాండ్ 6లో 125mAh బ్యాటరీ  ఇచ్చారు ఇంకా 14 రోజుల బ్యాకప్ ఉంటుందని  పేర్కొన్నారు.

click me!