వోడాఫోన్ ఐడియా 5జి నెట్ వర్క్.. లైవ్ ట్రయల్‌లో అద్భుతమైన స్పీడ్.. యూజర్లకు పండగే..

First Published Nov 27, 2021, 12:11 PM IST

భారతదేశంలో సాధారణ ప్రజల కోసం 5జి ఇంకా ప్రారంభించలేదు, అయితే ప్రభుత్వం టెల్కోలను ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతించిన తర్వాత వోడాఫోన్ ఐడియా (Vodafone Idea), ఎయిర్ టెల్ (Airtel), రిలయన్స్ జియో(Reliance Jio) కొన్ని నగరాల్లో 5జి నెట్‌వర్క్‌ను ట్రయల్ రన్ చేస్తున్నాయి. 

అయితే ఇందులో భాగంగా వోడాఫోన్ ఐడియా (VI) లైవ్ ట్రయల్‌ 5జి నెట్‌వర్క్‌లో 4.2Gbps స్పీడ్ సాధించింది. 

ఈ ట్రయల్ నవంబర్ 26న పూణేలో జరిగింది. ఈ వేగం 26 GHz స్పెక్ట్రమ్ బ్యాండ్ (millimeter band)లో కనుగొనబడింది. ఈ ఘనతపై వోడాఫోన్ ఐడియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ, "మిల్లీమీటర్ బ్యాండ్‌పై ట్రయల్ సమయంలో మేము 4.2Gbps స్పీడ్ సాధించాము." మిల్లీమీటర్ బ్యాండ్ అయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి వోడాఫోన్ ఐడియా 5G కోసం 26GHz, 3.5GHz స్పెక్ట్రమ్‌ను పొందిందని పేలిపారు.
 

ప్రభుత్వం 5జి ట్రయల్ వ్యవధిని ఆరు నెలల పాటు పొడిగించిందని, ఆ తర్వాత ట్రయల్ ఇప్పుడు మే 2022 వరకు పొడిగించిందని జగ్బీర్ సింగ్ చెప్పారు. గుజరాత్‌లోని పూణె, గాంధీనగర్‌లో 5జీ నెట్‌వర్క్ ట్రయల్ కొనసాగుతోందని కంపెనీ తెలిపింది. పూణేలో  సంస్థ భాగస్వామి ఎరిక్సన్, నోకియా సహాయంతో గాంధీనగర్‌లో 5G ట్రయల్ జరుగుతోంది.
 

వోడాఫోన్ ఐడియా  నోకియా, ఎరిక్సన్ కాకుండా ఎల్&టి స్మార్ట్ వరల్డ్ & కమ్యూనికేషన్, అథోనెట్ అలాగే భారతీయ స్టార్టప్‌లు విజ్ బీ(Vizzbee), ట్వీక్ లాబ్ (Tweek Lab) వంటి సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. మెడికల్, క్లౌడ్ గేమింగ్, స్పోర్ట్స్, పబ్లిక్ సేఫ్టీ, డ్రోన్‌లు, ఎమర్జెన్సీల కోసం నెట్‌వర్క్‌ని ఎలా ఉపయోగించవచ్చో చూపించే 5జి లైవ్ ట్రయల్స్‌ను వోడాఫోన్ ఐడియా డెమో చేసింది.

click me!