ప్రపంచంలోనే 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. లాంచ్, ఫీచర్స్ తెలుసా..?

First Published Nov 26, 2021, 12:59 PM IST

లెనోవా యాజమాన్యంలోని మోటోరోల (Motorola) కంపెనీ 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌(smartphone)ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటోరోల ఫోన్‌లో శాంసంగ్(samsung)  200 మెగాపిక్సెల్ సెన్సార్ అందించింది అని చెబుతున్నారు. మోటోరోల ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ లాంచ్ 2022 జూన్-జూలైలో కానుంది.

శాంసంగ్  ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో 200-మెగాపిక్సెల్ ISOCELL HP1 సెన్సార్‌ను పరిచయం చేసింది. మోటోరోల కాకుండా షియోమీ(Xiaomi) కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్‌లను విడుదల చేస్తున్న కంపెనీల జాబితాలో ఉంది.  షియోమీ  లాంచ్ ప్లాన్ కూడా వచ్చే ఏడాది మాత్రమే. అంతేకాకుండా 2023 నాటికి 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్‌ను కూడా పరిచయం చేయడానికి శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్   200-మెగాపిక్సెల్ ISOCELL సెన్సార్‌లోని పిక్సెల్‌ల సైజ్ 0.64 మైక్రాన్‌లు. ఈ లెన్స్ ద్వారా వినియోగదారులు 12.5-200 మెగాపిక్సెల్ రిజల్యూషన్ మధ్య ఫోటోలను క్లిక్ చేయగలరు.
 

మోటోరోల 60-మెగాపిక్సెల్  ఓమ్ని విజన్ (OmniVision) OV60A 0.61μm సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ ఎక్స్(Moto Edge X)పై కూడా పనిచేస్తోందని కూడా వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50A ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.

మోటోరోల  మోటో జి51(moto G51) వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావీస్తున్నారు. ఈ ఫోన్ మొదట యూరప్‌లో లాంచ్ అయ్యింది. మోటో జి51ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 120Hz డిస్‌ప్లే లభిస్తుంది. మోటో జి51 భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది.  మోటోరోల ఇండియా నుండి   ఈ  స్మార్ట్‌ఫోన్  లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు.
 

click me!