పిల్లల కోసం కరోనా వాక్సిన్: కోవిన్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకొండి ?

Ashok Kumar   | Asianet News
Published : Dec 27, 2021, 07:22 PM IST

న్యూఢిల్లీ: 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు  స్కూల్ గుర్తింపు కార్డులను ఉపయోగించి జనవరి 1 నుంచి CoWIN యాప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం ఉదయం తెలిపింది. ఒక నివేదిక ప్రకారం ఇందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో అదనపు స్లాట్ సృష్టించినట్లు తద్వారా విద్యార్థులు తమ ఐడి కార్డులను వాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.

PREV
14
పిల్లల కోసం కరోనా వాక్సిన్: కోవిన్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకొండి ?

 కోవిన్ యాప్‌లో పిల్లల రిజిస్ట్రేషన్ పెద్దల రిజిస్ట్రేషన్ లాగానే ఉంటుంది. 15-18 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కోవిన్ యాప్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోగలరు లేదా నేరుగా ఏదైనా వ్యాక్సిన్ సెంటర్‌కి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్ అందించిన తర్వాత వ్యాక్సిన్ పొందవచ్చు.

పిల్లల కోసం కోవాక్సిన్ లేదా ZyCoV-D టీకా!

12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు భారత్ బయోటెక్ డబుల్-డోస్ కోవాక్సిన్ లేదా జైడస్ కాడిల్లా త్రీ-డోస్ ZyCoV-Dని ప్రభుత్వం అధీకృతం చేసింది. వీటిలో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ను పిల్లలకు వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

24

Vaccines for children aged 15-18 years:                                                know How to register

34

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలపై ట్రయల్స్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ Novavaxని, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై ట్రయల్స్ కోసం బయోలాజికల్ E's Corbevaxని అనుమతిస్తుంది. Novavax లేదా Corbevax ట్రయల్స్ కోసం మాత్రమే అనుమతించబడ్డాయి, కానీ ఇంకా ఉపయోగం కోసం అనుమతించలేదు.

జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం 

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ అధ్వాన్నంగా మారడం ప్రారంభించింది. ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలకు బ్రేక్ వేశాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ లాంచ్ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసారు

44

15-18 ఏళ్ల మధ్య వయసుగల వారు తమ తొలి రౌండ్ కోవిడ్ వ్యాక్సిన్‌లను జనవరి 3 నుంచి పొందవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫ్రంట్‌లైన్ అండ్ ఆరోగ్య కార్యకర్తలు అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌ను ప్రకటించిన ప్రధాన మంత్రి, "చాలా దేశాలు ఇప్పటికే పిల్లలకు టీకాలు వేసాయి, పిల్లలకు టీకాలు వేసి స్కూల్స్  సాధారణ స్థితికి రావడానికి సహాయం చేశాయి" అని అన్నారు.

కరోనాతో పోరాడేందుకు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశాం. లక్ష ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేక వార్డులు నిర్మించాం. కరోనా యుద్ధంపై పోరాడేందుకు మూడు వేలకు పైగా ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించామని ప్రధాని చెప్పారు.

click me!

Recommended Stories