దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చిన ముఖేష్ అంబానీ.. జస్ట్ రూ.2599 మాత్రమే.. క్యాష్‌బ్యాక్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా..

First Published Nov 4, 2023, 6:40 PM IST

ప్రతి దీపావళి పండుగకు ఎన్నో  బ్రాండ్లు  కంపెనీ  ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. అయితే దేశంలోని అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ కూడా ప్రతి దీపావళి పండుగకు కొత్త ఉత్పత్తిని విడుదల చేయడం మర్చిపోరు.

 గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండుగ సందర్భంగా ముఖేష్ అంబానీ అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు. అలాగే ఈ ఏడాది దీపావళికి జనాలు కొనుక్కోగలిగే తక్కువ ధర ఆండ్రాయిడ్ మొబైల్‌ని విడుదల చేశారు. 

తక్కువ ధరలో JioPhone Prima 4G ఇండియాలో ప్రారంభించారు. దీని ధర కేవలం రూ.2,599 మాత్రమే. Jiophone Prima 4Gలో WhatsApp ఇంకా  YouTube కూడా  ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లలో ఈ ఫోన్  ఒకటి. గత కొన్ని నెలల్లో ముఖేష్ అంబానీ లాంచ్ చేసిన రెండో 4G ఫోన్ ఇదే. ముఖేష్ అంబానీ అతని కుమారుడు ఆకాష్ అంబానీ 2G యుగంలో 25 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులను ఆండ్రాయిడ్ ఫోన్‌లకు తీసుకురావడానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉన్నారు.

రిలయన్స్ రిలయన్స్ ప్రారంభించిన జియోఫోన్ ప్రైమా 4G
గతంలో భారతదేశంలో జియో భారత్ V2 ఫోన్‌ను రూ. 999కి విడుదల చేసింది. ఇప్పుడు మరిన్ని ఫీచర్లు, యాక్సెస్‌ అందించడానికి రిలయన్స్ జియో ఇప్పుడు దీపావళికి ముందు భారతదేశంలో JioPhone ప్రైమా 4Gని ప్రారంభించింది. ఇందులో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ మొదలైన వాటిని ఆస్వాదించవచ్చు.

ముఖేష్ అంబానీ కొత్త JioPhone Prima 4G JioMartలో బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ డీల్స్, బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్‌లు వంటి అనేక ఆఫర్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే, కొత్త JioPhone Prima 4G మార్కెట్‌లో చౌక ధరలో లభించే మరో ఫీచర్ ఫోన్‌లా కనిపిస్తుంది.
 

పేరు సూచించినట్లుగా, ఫోన్ 4G కనెక్టివిటీ, 23 భాషలకు సపోర్ట్ తో వస్తుంది. JioPhone Prima 4G ARM Cortex A53 ప్రాసెసర్‌తో 128GB ఎక్స్పన్దబుల్  స్టోరేజ్ తో  వస్తుంది. ఈ డివైజ్  KaiOSలో రన్ అవుతుంది,  చెప్పాలంటే Firefox OS ఆధారంగా 1200 యాప్‌లకు సపోర్ట్  ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్. ఫోన్ సింగిల్ సిమ్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తుంది. ఈ ఫీచర్లన్నీ  1800mAh బ్యాటరీతో అందించబడ్డాయి.
 

click me!