ప్రపంచంలో మొట్టమొదటి ప్రైవేట్ డిజిటల్ కోర్టు.. కరోనా వ్యాప్తి సమయంలో దీని ప్రయోజనలు తెలుసుకొండి..

First Published May 17, 2021, 2:33 PM IST

భారతదేశంలోని జూపిటిస్ జస్టిస్ టెక్నాలజీస్ ప్రైవేట్ జస్టిస్ సిస్టమ్ (ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం లేదా ఏ‌డి‌ఆర్ మెకానిజం) కింద ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ డిజిటల్ కోర్టును అభివృద్ధి చేసింది. ఈ సంస్థ లోటాక్ (లీగల్ టెక్నాలజీ) లో ఇన్నోవేషన్స్ పై చాలా కృషి చేస్తోంది.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న కోర్ట్ వివాదాలు, పెండింగ్‌లో ఉన్న కేసులు ప్రపంచవ్యాప్తంగా ప్రజా న్యాయ వ్యవస్థపై భారాన్ని పెంచాయి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు అధ్యయనం ప్రకారం ప్రాథమిక న్యాయ అవసరాలకు అక్సెస్ లేని వారు 5 బిలియన్ల మంది ఉన్నారు. అందుకే ఆన్‌లైన్ ఏ‌డి‌ఆర్ కార్యకలాపాలకు లేదా వెలుపల పరిష్కారం కోసం ఈ ఒక ప్రైవేట్ డిజిటల్ కోర్టు.
undefined
జూపిటిస్ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ రామన్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఇది కొత్త జస్టిస్ ఆర్డర్, ఇందులో పాల్గొన్న అన్ని పార్టీలు సంతోషంగా ఉన్నాయి. వ్యాజ్యం ప్రక్రియ కాకుండా వేగంగా, తక్కువ ఒత్తిడితో, తక్కువ ఖర్చుతో జస్టిస్ ఏ‌డి‌ఆర్ విధానం ద్వారా అందించబడుతుంది. ఫలితంగా పరస్పర ఒప్పందం, ఆరోగ్యకరమైన వ్యాపార సంబంధాన్ని సృష్టిస్తుంది. ' అని అన్నారు.
undefined
జూపిటిస్ ప్రైవేట్ డిజిటల్ కోర్ట్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ డిజిటల్ జస్టిస్ డెలివరీ ప్లాట్‌ఫాం, అలాగే ఏదైనా వివాదంలో పాల్గొన్న వారందరినీ ఆన్‌లైన్‌లో ఇంకా ఒకే ప్లాట్‌ఫామ్‌లో (కేస్ ఫైలింగ్ నుండి సెటిల్మెంట్ వరకు) పనిచేయడానికి అనుమతిస్తుంది. జూపిటిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ‌డి‌ఆర్ నిపుణులను సొంత 'మార్కెట్' నిర్మించడానికి సమీకరించింది, దీనివల్ల న్యాయం కోరుకునేవారికి జస్టిస్ ప్రొవైడర్లతో కనెక్ట్ అవ్వడం మరింత సులభం అవుతుంది.
undefined
జూపిటిస్ సహ వ్యవస్థాపకుడు శ్రే అగర్వాల్ 'జ్యూపీస్టీస్ లో న్యాయం అనేది ఒక సర్వీస్, ఇది ఇతర సేవల లాగానేఉంటుంది, మీరు ఏ‌డి‌ఆర్ నిపుణుల కోసం సెర్చ్ చేయవచ్చు, వారితో కనెక్ట్ అవ్వవచ్చు ఇంకా చివరిలో సేవలకు చెల్లింవచ్చు. ' అని అన్నారు. ప్రస్తుత కోవిడ్ -19 వ్యాప్తి దృష్య డిజిటల్ జస్టిస్ ఆవశ్యకత గతంలో కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది.
undefined
click me!