భవిష్యత్తులో పునర్జీవన (resuscitation) టెక్నాలజీ కనిపెట్టినప్పుడు, ఈ విధంగా భద్రపర్చిన మృతదేహాలను పునర్జీవం పోయవచ్చని, మరణానికి కారణాన్ని గుర్తించి చికిత్స చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
టుమారో బయో వెబ్సైట్లో ‘ప్రజలు ఎంతకాలం జీవించాలో నిర్ణయించుకునే ప్రపంచాన్ని సృష్టించడమే కంపెనీ లక్ష్యం’ అని చెబుతోంది.
ఇప్పటికే ఆరుగురు క్రయో ప్రిజర్వేషన్ విధానంలో తమ శరీరాలను సురక్షితంగా ఉంచేందుకు డబ్బు చెల్లించారు. అంతే కాకుండా, 650 మందికి పైగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు.