న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ రూల్ ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి టెలికాం రంగంలో పెద్ద మార్పు రానుంది. అదేంటంటే టైం లిమిట్ ఉల్లంఘిస్తే, సిమ్ కార్డ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది.
అందువల్ల, మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మీరు ప్రమాదానికి గురవుతారు. అవును, ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ నుంచి బయటపడేందుకు TRAI ఈ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మోసం లేదా బోగస్ కాల్స్ గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే టెలికాం కంపెనీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్ హెచ్చరించింది.