స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ నాలుగు కంపెనీల మొబైల్స్ వారంటీ పొడిగింపు..

First Published May 18, 2021, 2:27 PM IST

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నాలుగు పెద్ద మొబైల్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌ల వారంటీ వ్యవధిని పొడిగించాయి. మొదట గత వారం పోకో ఇండియా రెండు నెలల వారంటీని ప్రకటించింది.

ఆ తరువాత వివో ఇప్పుడు షియోమి, ఒప్పో కూడా స్మార్ట్‌ఫోన్‌ల వారంటీని పొడిగించాయి. గత సంవత్సరంలో కూడా పెరుగుతున్న కరోనా వ్యాప్తి కారణంగా చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ వారంటీని పొడిగించాయి.
undefined
షియోమి స్మార్ట్‌ఫోన్‌ వారంటీషియోమి స్మార్ట్‌ఫోన్‌ల వారెంటీని వచ్చే రెండు నెలల వరకు పొడిగించింది. షియోమి (ఎంఐ), రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఈ ప్రయోజనం చేకూరుస్తుంది. మీకు ఎం‌ఐ లేదా రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర డివైజెస్ ఉంటే దాని వారంటీ జూన్‌లో ముగుస్తుంది. ఎందుకంటే ఇలాంటి డివైజెస్ వారంటీ రెండు నెలల వరకు పొడిగించబడింది.
undefined
ఒప్పో స్మార్ట్‌ఫోన్ వారంటీభారతీయ కస్టమర్ల అవసరాన్ని గ్రహించిన ఒప్పో స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజెస్ వారంటీని జూన్ వరకు పొడిగించింది. వినియోగదారుల సౌలభ్యం కోసం + 91-9871502777 వాట్సాప్ నంబర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది . ఈ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా మీరు సర్వీస్ సెంటర్ గురించి రియల్-టైమ్ సమాచారాన్ని పొందవచ్చు.
undefined
వివో స్మార్ట్‌ఫోన్ వారంటీవివో స్మార్ట్‌ఫోన్ వారంటీని 1 నెల వరకు పొడిగించింది. ఈ సదుపాయం అందరూ వినియోగదారులకు కాదు, కేవలం ఏదైనా నగరం లేదా రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అయినప్పటికీ, ఈ వారంటీ సంస్థ అన్ని ఉత్పత్తులపై లభిస్తుందని వివో పేర్కొంది. వారంటీని పొడిగించడంతో పాటు, వివో కస్టమర్ల కోసం పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ప్రవేశపెట్టింది, ఇది పూర్తిగా ఉచితం.
undefined
పోకో స్మార్ట్‌ఫోన్ వారంటీపోకో ఇండియా స్మార్ట్‌ఫోన్ వారంటీని కూడా రెండు నెలల పాటు పొడిగించింది. మే ఇంకా జూన్ 2021లో స్మార్ట్‌ఫోన్ వారంటీ గడువు ముగిసిన వినియోగదారులను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. అలాగే వినియోగదారుల ఫోన్‌ల వారంటీని వచ్చే రెండు నెలల వరకు పొడిగించారు.
undefined
click me!