జియో దెబ్బకు టెలికాం ఆపరేటర్ల సంఖ్య 12 నుంచి 3కి పడిపోయింది: సునీల్‌ మిట్టల్‌

First Published Apr 17, 2021, 1:05 PM IST

 న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ మాట్లాడుతూ " ఎయిర్‌టెల్‌ ఎన్నో సంక్షోభాలను ఎదురుకొని నిలబడడమే కాకుండా మరింత వృద్ది చెందుతుందని,  దాదాపు మూడు, నాలుగు పెద్ద సంక్షోభాలను తట్టుకుని కూడా ఇప్పుడు పటిష్టమైన స్థితికి కంపెనీ చేరుకుందని" అన్నారు.  

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం పరిశ్రమలోకి జియో ఎంట్రీ అలాగే ఈ పరిశ్రమలో జియో వేసిన ముద్ర, దేశ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
undefined
2016లో జియో టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టి భారతీయ మార్కెట్లో అత్యంత శక్తివంతమైన పోటీదారిగా నిలిచింది. ప్రారంభంలోనే ఏడాది పాటు ఉచిత సేవలు, తరువాత ఏడాది పాటు డిస్కౌంట్ సేవలు, మార్కెట్‌ను కొల్లగొట్టే టారిఫ్‌లు, సబ్సిడీకె జియో ఫోన్లు, వీటన్నింటి ఫలితంగా అప్పట్లో ఉన్న 12 టెలికాం ఆపరేటర్లలో 9 మంది టెలికాం పరిశ్రమ నుండి వైదొలగడం, దివాలా తీయడం, మాతో ఇతర ఆపరేటర్లతో విలీనం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నేడు 3 ప్రైవేటు టెలికాం ఆపరేటర్లే మిగిలారు. వీరిలో ఒక ఆపరేటర్‌ భారీగా ఎదగడం ప్రశ్నార్థకమని సునీల్‌ మిట్టల్‌ తెలిపారు.
undefined
వ్యాపారాలకు భారత్‌ ఒక గొప్ప వేదిక. ఉత్పత్తులు, సేవలను భారీగా ఉపయోగించే ఎంతో మంది వినియోగదారులు ఉన్న మార్కెట్‌ ఇది. జీడీపీ, వినియోగ రంగానికి యువ జనాభా ప్రోత్సాహాన్నిస్తోంది. భారత్‌ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల సాయంతో అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఊబర్, ఓలా సేవలను వినియోగిస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి డెలివరీ సేవలు సహా అన్నీ కూడా డిజిటల్‌ వేదికపైకి వేగంగా మారుతున్నాయి అని మిట్టల్‌ వెల్లడించారు. చాలా పెద్ద పరిశ్రమలు చైనా నుంచి వ్యాపారాలను భారత్‌కు మార్చాలనుకుంటున్నారని దీంతో తయారీ రంగం భారత్‌కు రానున్నట్టు చెప్పారు. వచ్చే 5–10 ఏళ్లలో భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
undefined
ఇటీవల నిర్వహించిన వేలంలో స్పెక్ట్రంను కొనుగోలు చేసిన టెల్కోలకు కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్లు టెలికం శాఖ (డాట్‌) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ అసైన్‌మెంట్‌ లెటర్లను బిడ్డర్లకు శుక్రవారం జారీ చేసినట్లు తెలిపింది. స్పెక్ట్రంను వెంటనే కేటాయించిన నేపథ్యంలో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ సంస్థలు తక్షణం సుమారు రూ. 2,307 కోట్లు చెల్లించినట్లు డాట్‌ తెలిపింది.
undefined
ఇందులో ఎయిర్‌టెల్‌ రూ.157 కోట్లు, జియో రూ.2,160 కోట్లు చెల్లించాయి. ఈ ఏడాది ఆగస్టుసెప్టెంబర్‌లో టెల్కోలు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. మార్చిలో నిర్వహించిన వేలంలో టెలికం సంస్థలు మొత్తం రూ.77,821 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. వేలం నిబంధనల ప్రకారం ఇందులో సుమారు రూ. 21,918 కోట్లను మార్చి 18న ముందస్తుగా కట్టాయి. జియో రూ.57,100 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేయగా, ఎయిర్‌టెల్‌ రూ.18,700 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను దక్కించుకుంది. ఇక వొడాఫోన్‌ ఐడియా రూ. 1,993 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను వేలంలో కొనుగోలు చేసింది.
undefined
undefined
click me!