ఎన్ఆర్ఐ జగన్నాథరావు న్యూయార్క్ లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చంద్రన్నపై భూముల విక్రయానికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొచ్చారు. వెనువెంటనే తన ఇద్దరు కూతుళ్ల పేరున చంద్రుడిపై రెండు ఎకరాల భూమిని కొన్నాడు. వివిధ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించిన భూమికి సంబంధించిన ప్లాట్ నంబర్లు, ప్రాంతాల పేర్లను పేర్కొంటూ వారికి రిజిస్ట్రేషన్ హక్కు పత్రాన్ని జారీ చేశారు. ఇంకా, లూనార్ రిపబ్లిక్ సొసైటీ రెండు ఎకరాల భూమి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ స్పష్టంగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసింది.