చంద్రుడిపై రెండెకరాల భూమిని కొని తన ఇద్దరు కూతుళ్ల పేర్లపై రిజిస్టర్ చేయడం ద్వారా ఓ ప్రవాస భారతీయుడు(NRI) చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారత్ చేపట్టిన 'చంద్రయాన్-3' మిషన్ విజయవంతమవడంతో ఇస్రో మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. ఏంటంటే.. చంద్రునిపైకి మనుషులను పంపడం. ఈ ప్రయత్నం చంద్రుని ఉపరితలంపై మానవ నివాసానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడంపై దృష్టి సారించిన ప్రయోగాలతో సహా వివిధ అభివృద్ధిని ప్రోత్సహించింది.