మీకు ఎక్కువగా ఆన్ వాంటెడ్ మెసేజెస్, కాల్స్ వస్తున్నాయా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..

First Published Jul 13, 2021, 6:01 PM IST

మీకు ప్రతిరోజూ  వివిధ కంపెనీల నుండి  లేదా సర్వీస్ నుండి అవాంఛిత మెసేజులు వస్తుంటాయి. ఇలాంటివి  అందుకుంటున్న వారు చాలా మంది ఉంటారు.  ఎక్కడైనా షాపింగ్ చేసిన లేదా కొనుగోలు చేసినప్పుడు ఆఫర్స్ లేదా నోటిఫికేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుంటారు. ఒకోసారి ఎలాంటి  మెసేజులు, కాల్స్ ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు. 

వీటిని వొద్దనుకునే వారు వారి నంబరు పై డోంట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) ఫీచర్ ఆక్టివ్ చేస్తుంటారు, అయిన కాని ప్రజలకు కొన్ని రకాల అవాంఛిత క్యాంపైన్ మెసేజులు, కాల్స్ వస్తుంటాయి. దీనికి సంబంధించిన ఒక విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డి‌ఎన్‌డి ఆన్ చేసిన తరువాత కూడా 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ సమాచారం ఒక సర్వే నుండి లభించింది.
undefined
ట్రాయ్ డి‌ఎన్‌డి జాబితాలో 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు వస్తున్నాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నివేదిక పేర్కొంది. సర్వే నివేదిక ప్రకారం, 26 శాతం మందికి పంపిన అవాంఛిత మెసేజులు 25 శాతం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుండే. దేశంలోని 324 జిల్లాలకు చెందిన 35వేల మందితో లోకల్‌సర్కిల్స్‌ ఈ సర్వే నిర్వహించింది.
undefined
డి‌ఎన్‌డి ఆన్ చేసిన తర్వాత కూడా మీకు అవాంఛిత మెసేజులు వస్తున్నట్లయితే, దాన్ని ఆపడానికి ప్రస్తుతం సులభమైన మార్గం లేదు. అయితే ఈ మెసేజులను పంపేవారి నంబరును ఒక్కొక్కటిగా బ్లాక్ చేయడం ఒకే ఒక మార్గం.
undefined
ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి అవాంఛిత కాల్స్, మెసేజెస్ పై దృష్టి సారించింది. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల కోసం పరిమిత సంఖ్యలో అవాంఛిత కాల్‌, మెసేజులు పై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తుంది. ఈ నిబంధనను ఏదైనా సంస్థ ఉల్లంఘిస్తే మెసేజులూ పంపినవారికి రూ .1,000 నుండి రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు.
undefined
click me!