ఇదిలా ఉంటే.. తమకు మద్దతుగా రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని బజరంగ్ పునియా కోరారు. ఇది మన ఆడపిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. బ్రిజ్ భూషణ్ లాంటి వ్యక్తులు నేరస్థుడైనప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. ఇక, ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.