India vs England : మిస్టరీ స్పిన్నర్‌ ఔట్.. సీనియర్ రీఎంట్రీ : సెమీస్‌లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Published : Mar 05, 2026, 11:53 AM IST

T20 World Cup 2026 : ఇవాళ ఇంగ్లండ్‌తో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందో చూద్దాం.

PREV
15
ఇండియా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్ పోరు

టీ20 వరల్డ్ కప్ 2026 విజయానికి కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది టీమిండియా. ఈ క్రమంలో ఇవాళ (మార్చి 5, గురువారం) ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ లో తలపడనుంది. సూపర్-8 లో భయంకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన  వెస్టిండిస్ ను చిత్తుచేసిన సూర్య సేన రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ కు చేరింది. ఈ వరల్డ్ కప్ లో మొదటిసారి ఇంగ్లాండ్ తో తలపడుతోంది. 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే వాంఖడే పిచ్, ముంబై పరిస్థితులకు అనుకూలంగా టీమిండియాలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించి సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

25
వరుణ్ బౌలింగ్ అంత గొప్పగా లేదు

ఈ వరల్డ్ కప్ మెగా టోర్నీలో వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 12 వికెట్లు తీసి టాప్ బౌలర్ల జాబితాలో నిలిచాడు. అయితే సూపర్-8 తొలి భారత్ తలపడ్డ మొదటి మ్యాచ్ లో వరుణ్ భారీగా సమర్పించుకున్నాడు… పలితంగా సౌతాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక జింబాబ్వేపైనా అతని బౌలింగ్ అంత గొప్పగా లేదు. 

ఇదే సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు 'మిస్టరీ స్పిన్' కంటే సాధారణ స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారు. అందుకే కుల్దీప్‌ను తీసుకురావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

35
వరుణ్ స్థానంలో కుల్దీప్
ముంబై వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలించినా, గత కొన్ని మ్యాచ్‌లుగా బంతి కాస్త ఆగి టర్న్ అవుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లపై కుల్దీప్ యాదవ్ 'రిస్ట్ స్పిన్'కు మంచి రికార్డు ఉంది. అందుకే వరుణ్ స్థానంలో కుల్దీప్‌కు చోటు దక్కొచ్చు. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడగ్గా.. 'అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్, వరుణ్‌లలో ఎవరిని ఆడించాలనేది ఒక స్వీట్ హెడేక్' అని సమాధానమిచ్చాడు.
45
అభిషేక్ శర్మ కూడా ఔటేనా?

ఒకవేళ మ్యాచ్‌కు ముందు పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తే, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.. ముగ్గురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలా జరిగితే అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ టోర్నీలో 3 సార్లు డకౌట్ అయిన అతను, మొత్తం మీద 80 పరుగులు కూడా చేయలేదు. దీంతో అతన్ని తుది జట్టులో ఉంచుతారా లేదా అనేది అనుమానంగానే ఉంది.

55
భారత తుది జట్టు ఇదే..

ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు భారత తుది జట్టు (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ/రింకూ సింగ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

Read more Photos on
click me!

Recommended Stories