Priyansh Arya : సెంచరీ మిస్.. ప్రీతి జింటా గుండె బద్దలు ! ఎవరీ రన్ బాజ్ ప్రియాంష్‌ ఆర్య?

Published : Apr 19, 2026, 10:18 PM IST

Priyansh Arya : పంజాబ్ కింగ్స్ యంగ్ సెన్సేషన్ ప్రియాంష్‌ ఆర్య దుమ్మురేపాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై 37 బంతుల్లో 93 పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే, సెంచరీ మిస్ కావడంతో నిరాశ చెందిన ప్రీతి జింటా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

PREV
16
9 సిక్సర్లతో విరుచుకుపడ్డ ప్రియాంష్‌ ఆర్య.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్

ఐపీఎల్ 2026లో మరో సంచలనం నమోదైంది. పంజాబ్ కింగ్స్ యువ కెరటం, ఎడమచేతి వాటం ఓపెనర్ ప్రియాంష్‌ ఆర్య తన బ్యాటింగ్‌తో స్టేడియంను హోరెత్తించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్య కేవలం తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతను అవుటైన సమయంలో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

26
టాస్ గెలిచిన లక్నో.. షమీ ఆరంభపు దెబ్బ

న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రసవత్తర పోరు జరిగింది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో నమ్మకాన్ని నిలబెడుతూ సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ సమయంలో పంజాబ్ కష్టాల్లో పడుతుందని అందరూ భావించారు.

36
ఆర్య - కోనోలీ విధ్వంసం: 182 పరుగుల భాగస్వామ్యం

తొలి వికెట్ త్వరగా పడినా ప్రియాంష్‌ ఆర్య ఏమాత్రం తగ్గలేదు. అతనికి తోడుగా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ క్యూపర్ కోనోలీ జతకలిశాడు. వీరిద్దరూ కలిసి లక్నో బౌలర్లను ఉతికి ఆరేశారు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. రెండో వికెట్‌కు ఈ జోడి కేవలం 80 బంతుల్లోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డులు సృష్టించింది. కోనోలీ తన మొదటి ఐపీఎల్ సీజన్‌లోనే 46 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు.

46
7 పరుగుల దూరంలో ఆగిపోయిన సెంచరీ కల

ఈ మ్యాచ్‌లో ప్రియాంష్‌ ఆర్య ఆడిన తీరు అద్భుతం. కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. 251.35 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆర్య, ఐపీఎల్ 2026లో మూడో సెంచరీ వీరుడిగా నిలుస్తాడని అంతా ఆశించారు. అయితే, స్పిన్నర్ ఎం. సిద్ధార్థ్ వేసిన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ఆర్య క్యాచ్ అవుట్ అయ్యాడు. కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేజారడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.

56
ప్రీతి జింటా ఎమోషనల్ రియాక్షన్

ప్రియాంష్‌ ఆర్య అవుట్ అవ్వగానే కెమెరాలు పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా వైపు తిరిగాయి. ఆర్య సెంచరీ మిస్ అవ్వడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. తలపై చేతులు పెట్టుకుని బాధపడ్డారు. 

కానీ, వెంటనే తేరుకున్న ప్రీతి, ఆర్య అద్భుత ఇన్నింగ్స్‌ను గౌరవిస్తూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఈ యువ ఆటగాడి అద్భుత ప్రదర్శనకు ఫిదా అయి ఘనంగా వీడ్కోలు పలికారు.

66
254 పరుగుల భారీ లక్ష్యం.. ఆకట్టుకున్న ప్రిన్స్ యాదవ్

ఆర్య, కోనోలీ మెరుపుల పుణ్యమా అని పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 21 సిక్సర్లు, 14 ఫోర్లు నమోదయ్యాయి. లక్నో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం ఆకట్టుకున్నాడు. అతను తన 4 ఓవర్ల కోటాలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం విశేషం.

భారత క్రికెట్‌లో ఉదయిస్తున్న ధ్రువతార ప్రియాంష్‌ ఆర్య

పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ప్రియాంష్‌ ఆర్య, అత్యంత వేగంగా ఆడే లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. ఢిల్లీలో 2001, జనవరి 18న జన్మించిన 23 ఏళ్ల ఈ యువ ఆటగాడిని 2025 ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.

2025 డెబ్యూ సీజన్‌లోనే 180 స్ట్రైక్ రేట్‌తో 475 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆర్య, చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 42 బంతుల్లోనే 103 పరుగులు చేసి తన పవర్‌ను చాటుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ, ఇండియా-ఏ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తాజాగా ఐపీఎల్ 2026లో లక్నోపై 37 బంతుల్లోనే 93 పరుగులు చేయడమే కాకుండా, క్యూపర్ కోనోలీతో కలిసి 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన పవర్‌ప్లే బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు.

Read more Photos on
click me!

Recommended Stories