వరల్డ్ కప్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓటమిని విశ్లేషిస్తూ, ఒక దశలో 18 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన పరిస్థితిని కమ్మిన్స్ గుర్తుచేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప..
2026 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ నుంచే హాట్ ఫేవరెట్ ఆస్ట్రేలియా జట్టు అనూహ్యంగా నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.
25
ఆస్ట్రేలియా ఓటమి
వరల్డ్ కప్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓటమిని విశ్లేషిస్తూ, ఒక దశలో 18 బంతుల్లో 48 పరుగులు కావాల్సిన పరిస్థితిని కమ్మిన్స్ గుర్తుచేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప మరే బ్యాటర్ కూడా ఆ లక్ష్యాన్ని ఛేదించలేడని అభిప్రాయపడ్డారు.
35
మాకొక విరాట్ కోహ్లీ లేడు
"మా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ మాకొక విరాట్ కోహ్లీ లేడు. మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒత్తిడిని చిత్తు చేస్తూ జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఒక్క కోహ్లీకే ఉంది," అని కమ్మిన్స్ తెలిపారు. జింబాబ్వేతో ఆడిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లలో అలాంటి ఇన్నింగ్స్ ఆడగలిగే బ్యాటర్ లేకపోవడం వల్లే ఓడిపోయామని ఆయన వెల్లడించారు. కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టులో భయం ఉంటుందని, 37 ఏళ్ల వయసులో కూడా అతడి ఫిట్నెస్, ఆట పట్ల అంకితభావం అద్భుతమని కమ్మిన్స్ కొనియాడారు.
ఈ సందర్భంగా, 2022 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కోహ్లీ ఆడిన చరిత్రాత్మక ఇన్నింగ్స్ను కమ్మిన్స్ ప్రస్తావించారు. "అలాంటి ఆటను మళ్లీ ఎవరూ పునరావృత్తం చేయలేరు," అని ఆయన పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ విరాట్ కోహ్లీ క్రీజులో పాతుకుపోయి భారత జట్టుకు విజయం అందించాడు.
55
క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్
ఆ మ్యాచ్లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి, ఆస్ట్రేలియా ప్రపంచకప్ నుండి నిష్క్రమించిన నేపథ్యంలో పాట్ కమ్మిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ ప్రాముఖ్యతను, అతని అసాధారణమైన మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పాయి.