తిక్క కుదర్చనుంది.! టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ జట్టు బ్యాన్.? డెడ్‌లైన్ ఇచ్చేశారుగా

Published : Feb 03, 2026, 05:48 PM IST

Pakistan Cricket: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌తో జరగాల్సిన కీలక లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ ప్రకారం, ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. 

PREV
15
భారత్‌తో జరగాల్సిన కీలక టీ20 మ్యాచ్‌ను

ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్‌తో జరగాల్సిన కీలక టీ20 మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ప్రస్తుతం ఇదే క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. ఈ చర్యతో పాక్ జట్టుపై ఐసీసీ వేటు వేయనుందని టాక్ వినిపిస్తోంది.

25
2026 టీ20 ప్రపంచకప్‌లో..

2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ లీగ్ మ్యాచ్‌ను స్వచ్ఛందంగా బహిష్కరించిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాలసీ రక్షణను కోల్పోతుంది.

35
పీసీబీ పెనాల్టీలతో పాటు..

దీంతో పీసీబీ పెనాల్టీలతో పాటు బ్రాడ్‌కాస్టర్ల నుంచి చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్ విలువ దాదాపు రూ. 4,500 కోట్లుగా అంచనా. ఇందులో టీవీ, డిజిటల్ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయమే అధికం.

45
రూ. 300 కోట్ల ఆదాయం అంచనా

ఆ ప్రకటనల ద్వారానే రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్లకు రూ. 370 నుంచి రూ. 400 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఐసీసీ ఈ నష్టాన్ని భరించినప్పటికీ, సభ్యదేశాలకు పంచే ఆదాయాన్ని తగ్గిస్తుంది.

55
చెరో రూ. 200 కోట్ల నష్టం

భారత్, పాక్‌లకు చెరో రూ. 200 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న బీసీసీఐపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే నష్టాల్లో ఉన్న పీసీబీకి ఇది పెనుభారంగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories