Most Runs For Single IPL Franchise : ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీకి ఆడుతూ అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ధోనీ కూడా ఉన్నారు.
ఒకే ఐపీఎల్ టీమ్.. వేల కొద్దీ పరుగులు: టాప్-5 లిస్ట్ ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎందరో ఆటగాళ్లు తమ జట్లను మార్చుకున్నారు. కానీ, కొందరు మాత్రం ఒకే ఫ్రాంచైజీకి అంకితమై, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ నుండి రోహిత్ శర్మ వరకు, ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం అత్యధిక పరుగులు సాధించిన ఐదుగురు బ్యాటర్ల వివరాలు గమనిస్తే.. అందులో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు కూడా చోటు దక్కించుకున్నారు.
26
విరాట్ కోహ్లీ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ కోసం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న కోహ్లీ, ఇప్పటివరకు 267 మ్యాచ్లలో ఏకంగా 8,661 పరుగులు సాధించి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నారు. లీగ్ ప్రారంభమైనప్పటి నుండి, కోహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్కు గుండెకాయలా నిలిచారు.
మైదానంలో ఆయన ప్రదర్శించే ఇంటెన్సిటీ, క్లాస్, అద్భుతమైన షాట్-మేకింగ్ సామర్థ్యం, ఆర్సీబీ అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నాయి. నిలకడైన ప్రదర్శనతో జట్టుకు వెన్నముకలా నిలిచిన కోహ్లీ, ఒకే జట్టు కోసం ఇన్ని పరుగులు సాధించడం నిజంగా ఒక అరుదైన ఘనత.
36
రోహిత్ శర్మ - ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ, ఒకే ఫ్రాంచైజీ కోసం అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ముంబై ఇండియన్స్ తరఫున 227 మ్యాచ్లు ఆడిన రోహిత్, మొత్తం 5,876 పరుగులు తన ఖాతాలో వేసుకున్నారు.
కేవలం బ్యాటర్గానే కాకుండా, దీర్ఘకాలం పాటు జట్టు కెప్టెన్గా, బ్యాటింగ్ ప్రధానాస్త్రంగా రోహిత్ వ్యవహరించారు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ను అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో రోహిత్ శర్మ పాత్ర ఎంతో కీలకం. ఆయన నాయకత్వం, బ్యాటింగ్ పటిమ జట్టుకు ఎన్నో విజయాలను అందించాయి.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎంఎస్ ధోనీ. ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం అత్యధిక పరుగులు చేసిన వారిలో ధోనీ కూడా ఒకరు. సీఎస్కే తరఫున 248 మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించిన ధోనీ, 4,865 పరుగులు సాధించారు. 2008 నుండి చెన్నై సూపర్ కింగ్స్ ముఖచిత్రంగా ధోనీ కొనసాగుతున్నారు.
అయితే, ధోనీ గొప్పతనం కేవలం ఆయన చేసిన పరుగుల సంఖ్యకు మాత్రమే పరిమితం కాదు. ప్రశాంతంగా మ్యాచ్ను ముగించే ఆయన సామర్థ్యం, సాటిలేని గేమ్ అవేర్నెస్, నాయకత్వ లక్షణాలు ఆ ఫ్రాంచైజీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. సీఎస్కే విజయ ప్రయాణంలో ధోనీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
56
సురేష్ రైనా - చెన్నై సూపర్ కింగ్స్
మిస్టర్ ఐపీఎల్ గా గుర్తింపు పొందిన సురేష్ రైనా, ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోసం అత్యధిక పరుగులు సాధించిన అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 176 మ్యాచ్లు ఆడిన రైనా, 4,687 పరుగులు సాధించారు. ఒక దశాబ్దానికి పైగా సీఎస్కే బ్యాటింగ్కు బ్యాక్ బోన్ గా నిలిచారు.
మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్కు వచ్చి ఇన్నింగ్స్కు స్థిరత్వాన్ని, నిలకడను, జోష్ను అందించడంలో రైనా దిట్ట. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలోనూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలోనూ రైనా ఎప్పుడూ ముందుండేవారు.
66
ఏబీ డివిలియర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత ఏబీ డివిలియర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆర్సీబీ కోసం 156 మ్యాచ్లు ఆడిన ఈ దక్షిణాఫ్రికా స్టార్, 4,491 పరుగులు సాధించారు.
మైదానంలో ఏ వైపుకైనా బంతిని పంపగల ఆయన సామర్థ్యంతో మిస్టర్ 360గా గుర్తింపు పొందాడు. ఎలాంటి బౌలింగ్ దాడినైనా ఎదుర్కోగల సత్తా ఆయన సొంతం. ఆర్సీబీలో ఉన్నంత కాలం డివిలియర్స్ అల్టిమేట్ గేమ్ చేంజర్గా నిలిచాడు.