సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్.. పాక్ ప్లేయర్‌ను కొన్న పాపానికి కావ్య మారన్‌కు చుక్కలు ! ఏం జరిగిందంటే?

Published : Mar 13, 2026, 03:39 PM IST

Kavya Maran’s Sunrisers : సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే భారత్‌లో ఆ జట్టు అధికారిక ఎక్స్ ఖాతా సస్పెండ్ అయింది. పాక్ ప్లేయర్ కోసం కోసం రూ. 2.34 కోట్లు పోసి కావ్య మారన్ చిక్కుల్లో పడ్డారు.

PREV
15
Sunrisers : కావ్యా మారన్ కొంపముంచిన పాక్ ప్లేయర్.. సన్‌రైజర్స్ అకౌంట్ క్లోజ్ !

ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో సంచలనం నమోదైంది. భారత ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సోదర సంస్థ సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా భారత్‌లో సస్పెండ్ అయింది. పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను వేలంలో కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎక్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాను నిలిపివేసినట్లు స్క్రీన్ పై కనిపిస్తోంది. అయితే ఏ నిబంధనలు ఉల్లంఘించారనే దానిపై స్పష్టత లేదు.

25
అబ్రార్ అహ్మద్‌ ఎంపికపై వెల్లువెత్తిన నిరసన

గురువారం జరిగిన ది హండ్రెడ్ ప్లేయర్ల వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ స్వయంగా పాల్గొన్నారు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అబ్రార్ అహ్మద్ కోసం ఆమె పట్టుబట్టి రూ. 2.34 కోట్లు వెచ్చించారు.

గతంలో భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా ఐపీఎల్ అనుబంధ జట్లు పాక్ ప్లేయర్లను దూరం పెడతాయని వార్తలు వచ్చాయి. కానీ కావ్య మారన్ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అబ్రార్‌ను సైన్ చేశారు. దీంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పట్ల వ్యతిరేకత ఉన్న ప్లేయర్‌ను ఎలా కొంటారని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.

35
గతంలో భారత విమాన దళాన్ని అవమానించిన అబ్రార్

అబ్రార్ అహ్మద్‌పై ఇంతలా ఆగ్రహం రావడానికి ప్రధాన కారణం అతని పాత సోషల్ మీడియా పోస్టులే. 2019లో పాక్ సరిహద్దులో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చిక్కుకున్నప్పుడు, పాక్ ఆర్మీ ఇచ్చిన టీని తాగుతూ ఆయన టీ చాలా బాగుంది" అని చెప్పారు. ఆ పదాన్ని వాడుతూ భారత్‌ను ఎగతాళి చేస్తూ అబ్రార్ గతంలో వీడియోలు, పోస్టులు పెట్టారు. రంజాన్ ముందు "చివరి కప్పు ఫెంటాస్టిక్ టీ" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని వెక్కిరించినట్లు ఉన్నాయని అభిమానులు గుర్తు చేస్తున్నారు. భారత్ పై ఇలా విషం కక్కే పాక్ ప్లేయర్ కు కావ్య మారన్ ఎలా అవకాశం ఇస్తారని ఫైర్ అవుతున్నారు.

45
కావ్య పాప నిర్ణయంపై అభిమానుల అల్టిమేటం

వేలం టేబుల్ వద్ద కావ్య మారన్ వరుసగా బిడ్ వేస్తున్నప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. "ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొన్నప్పుడు షారుఖ్ ఖాన్‌ను విమర్శించినట్లే, ఇప్పుడు కావ్యా మారన్‌ను కూడా విమర్శించాలి. ముస్తాఫిజుర్ ఎప్పుడూ భారత్‌ను అవమానించలేదు, కానీ అబ్రార్ భారత్ అంటేనే విషం కక్కుతాడు" అని ఒక అభిమాని రాసుకొచ్చారు. మరికొందరు అయితే "అబ్రార్ కనుక జట్టులోకి వస్తే, ఇదే సన్‌రైజర్స్‌కు అభిమానిగా నా చివరి రోజు" అంటూ అల్టిమేటం జారీ చేశారు.

55
గతంలోనూ ఇతర ఫ్రాంచైజీల కొనుగోళ్లు

అయితే పాక్ ఆటగాళ్లను ఐపీఎల్ అనుబంధ జట్లు కొనడం ఇదే మొదటిసారి కాదు. 2023 నుంచి పలు జట్లు ఈ పని చేస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (CPL) కోసం మహ్మద్ అమీర్, ఉస్మాన్ తారిక్ ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాటా ఉన్న సీటెల్ ఓర్కాస్ కోసం ఇమాద్ వసీమ్, జమాన్ ఖాన్ ఆడారు. అలాగే ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ కోసం ఉస్మాన్ ఖాన్ ఆడారు. కానీ అబ్రార్ అహ్మద్ విషయంలో ఉన్న రాజకీయ వివాదం కారణంగా ఇప్పుడు సన్‌రైజర్స్ గ్రూప్ టార్గెట్ అయింది. ఈ వివాదం సన్‌రైజర్స్ లీడ్స్ డిజిటల్ ఉనికిపై గట్టి దెబ్బే కొట్టింది.

Read more Photos on
click me!

Recommended Stories