IPL 2026: గెలవాల్సిన మ్యాచ్.! అంతా అయిపోయిందనుకునేసరికి తప్పు జరిగింది.. ఢిల్లీ కెప్టెన్

Published : Apr 09, 2026, 10:45 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ 92 పరుగులతో మెరిసినప్పటికీ.. 

PREV
15
ఢిల్లీని ఊరించిన విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత పోరు క్రికెట్ అభిమానులను అలరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకు విజయం ఎటువైపు మొగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో, గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది.

25
లక్ష్య చేదనలో ఢిల్లీ పోరాటం

గుజరాత్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిశాంక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ 92 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా, నిశాంక 41 పరుగులు చేశాడు. అయితే, జట్టు స్కోరు 100 దాటిన తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడటంతో ఢిల్లీ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.

35
మిల్లర్ ఒంటరి పోరాటం

చేతికి గాయమైనప్పటికీ డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో ఢిల్లీని విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది.

45
బట్లర్ మ్యాజిక్

ఆ బంతికి మిల్లర్ షాట్ ఆడలేకపోయినా, పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అత్యంత వేగంగా స్పందించి బంతిని నేరుగా వికెట్లకు కొట్టడంతో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.

55
ఓటమిపై అక్షర్ పటేల్ స్పందన:

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ తమ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో(9వ ఓవర్ నుంచి) వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లనే ఒత్తిడి పెరిగిందని, లేదంటే ఈ మ్యాచ్‌ను ముందే ముగించే అవకాశం ఉండేదని అన్నాడు. కేఎల్ రాహుల్, మిల్లర్ ప్రదర్శనను అభినందించాడు. చివరి బంతుల్లో ఎప్పుడూ ఫలితం మనకు అనుకూలంగా ఉండదని, తెలివిగా ఆడి ఉండాల్సిందని అక్షర్ పేర్కొన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories