ఆసియా కప్ గెలిచిన జట్టులో భారత్ ఒకే మార్పు చేసింది. రింకూ సింగ్ స్థానంలో పేసర్ హర్షిత్ రాణా అవకాశాన్ని పొందాడు. పేస్ ఫ్రెండ్లీ కండీషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఛాంపియన్ బౌలర్ అర్షదీప్ సింగ్ను బెంచ్లో కూర్చోబెట్టడంతో గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా ప్లేయింగ్-XI: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టాయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎలిస్, మాథ్యూ క్యూనెమాన్, జోష్ హేజిల్వుడ్