IND vs NZ : 2024, 2026 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సేమ్ అంపైర్.. మరి రిజల్ట్ కూడా సేమేనా..? ఇంతకూ ఎవరతను..?

Published : Mar 07, 2026, 01:07 PM IST

T20 World Cup 2026 Final : రేపు (ఆదివారం) జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు అంపైర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ పైనల్లో అంపైరింగ్ చేసిన వ్యక్తే 2026 లోనూ చేయనున్నాడు.

PREV
15
ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ కు వీళ్లే అంపైర్లు..

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య హైవోల్టేజ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు అంపైర్లుగా ఎవరు వ్యవహరిస్తారనే ఉత్కంఠకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెరదించింది. ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం... ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు.

25
టీమిండియాకు ఇల్లింగ్‌వర్త్‌ సెంటిమెంట్..

రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌కు ఇది వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్. గతంలో బార్బడోస్‌లో జరిగిన ఇండియా-దక్షిణాఫ్రికా ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈయనే అంపైర్‌గా ఉన్నారు. అంతేకాదు 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లోనూ ఇల్లింగ్‌వర్త్ అంపైరింగ్ చేశారు. దీంతో టీ20 వరల్డ్ కప్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని... ఇల్లింగ్ వర్త్ అంపైరింగ్ లో టీమిండియా మరో విజయం సాధిస్తుందని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

35
బెస్ట్ అంపైర్ గా ఇల్లింగ్‌వర్త్‌ రికార్డు...

మైదానంలో ఆటగాళ్ల ప్రతి మూమెంట్ ని పరిశీలిస్తూ ఖచ్చితమైన నిర్ణయాలు ఇవ్వడంలో ఇల్లింగ్‌వర్త్‌ దిట్ట. అందుకే అతడిని ఐసిసి ఏకంగా నాలుగుసార్లు బెస్ట్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికచేసింది. 2019 లో మొదటిసారి ఎంపికైన అతడు 2022,2023,2024 వరుసగా బెస్ట్ అంపైర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. ఇలా ఎలైట్ ప్యానెల్‌లో నాలుగుసార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక అంపైర్ ఇతడు. గతంలో దిగ్గజ అంపైర్ సైమన్ టౌఫెల్ వరుసగా ఐదుసార్లు బెస్ట్ అంపైర్ గా నిలిచారు.

45
ఎవరీ అలెక్స్ వార్ఫ్‌..?

మరో అంపైర్ అలెక్స్ వార్ఫ్‌కు ఇది తొలి వరల్డ్ కప్ ఫైనల్. వార్ఫ్ గతంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆటగాడిగా కూడా ఆడారు. ఇతడికి 2022 మహిళల వన్డే వరల్డ్ కప్, 2023 పురుషుల వన్డే వరల్డ్ కప్‌లలో మ్యాచ్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. విశేషం ఏంటంటే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా తొలి సెమీఫైనల్ మ్యాచ్‌ను కూడా వీళ్లిద్దరే నిర్వహించారు. 

ఇక అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ కు దక్షిణాఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్ మూడో అంపైర్‌గా, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా బాధ్యత తీసుకోనున్నారు.

55
అహ్మదాబాద్ స్టేడియంలో సందడి...

ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్ స్టేడియంలో గ్రాండ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రముఖ సింగర్ రికీ మార్టిన్ తన పాటలతో స్టేజ్‌పై సందడి చేయనున్నారు. సుమారు లక్ష మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా, కోట్లాదిమంది పరోక్షంగా చూడనున్నారు. ఆయనతో పాటు 'దాండియా క్వీన్' ఫల్గుణి పాఠక్, బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, 6:30 గంటలకు టాస్ వేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories