శబరిమలకు వెళ్లే భక్తులు ఏం చేయాలి?

First Published Dec 17, 2023, 3:50 PM IST

కేరళలో ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయానికి ప్రతి ఏడాది భక్తులు వెళ్లివస్తుంటారు. ఈ ఆలయం ఈ సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయం, దాని చుట్టూ ఉన్న ప్రాంతం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

sabarimala ayyappa

కేరళలోని ఎంతో ప్రసిద్ధి చెందిన శబరిమల ఆలయ సందర్శనానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం ఉంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్లిరావాలని చాలా మంది అనుకుంటారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి ఎగువన కొండపై  ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అందమైన పర్వతాలు, పచ్చని దట్టమైన అడవులు మనల్ని కనువిందు చేస్తాయి. 

sabarimala

అయ్యప్పస్వామి 

శివుడు, విష్ణువు (మోహిని అవతారం) కలయిక నుంచి అయ్యప్ప స్వామి జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామిని హరిహరపుత్రుడు అని కూడా అంటారు. అందుకే శబరిమల దక్షిణ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర, పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
 

Sabarimala

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులు ఏం చేయాలి?

శబరిమలకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే ఇక్కడికి వెళ్లే భక్తులు అయ్యప్పస్వామిని చిత్తశుద్ధితో పూజించాలి. అలాగే అయ్యప్పస్వామిని పూజించడానికి కొన్ని నియమాలను పాటించాలి. అయ్యప్పస్వాములు అయ్యే వారు  సాధారణంగా 41 రోజుల పాటు కఠిన ఉపవాసం ఉంటారు. ఇది సాధారణంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 24 వరకు ఉంటుంది.  అయ్యప్పస్వామి ఆలయం ఒక కొండపై ఉంటుంది. అందుకే ఉపవాసం ఉన్న భక్తులు దేవుడిపై నమ్మకం ఉంచితేనే ఈ ఆలయానికి చేరుకుంటారని నమ్మకం ఉంది. 

sabarimala

భక్తులు ఏం చేస్తారు?

శబరిమలకు వెళ్లే యాత్రికులు పాలతో ఉత్పత్తులను తప్ప మాంసాహారం అసలే తినకూడదు. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. బూతు, అసభ్య మాటలను మాట్లాడకూడదు. అలాగే మందు, పొగాకును తీసుకోకూడదు. తీర్థయాత్ర పూర్తయ్యే వరకు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు భక్తులు నలుపు లేదా సాదా నీలం రంగు దుస్తులనే మాత్రమే ధరించాలి. కానీ కొంతమంది వైదిక నియమాల ప్రకారం కాషాయ దుస్తులను వేసుకుంటారు. 
 

Sabarimala

పవిత్ర మెట్లు, వాటి ప్రాముఖ్యత

అయ్యప్ప ఆలయానికి వెళ్లే 18 మెట్లును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ఎన్నో అంశాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లు.. ఐదు ఇంద్రియాలను సూచిస్తే, తరువాతి ఎనిమిది మెట్లు ఎనిమిది ఇంద్రియాలను సూచిస్తాయి. తర్వాతి  మూడు త్రిగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక చివరి రెండు విద్య, అవిద్యకు ను సూచిస్తాయి. ఎవరైతే ఈ మెట్లు ఎక్కుతారో వారు అన్ని ప్రాపంచిక కోరికల నుంచి తమను తాము వేరు చేసుకుంటారని నమ్ముతారు. 

click me!