వైకుంఠ ఏకాదశి 2025: చేయకూడని పనులు
1. శాస్త్రాల ప్రకారం.. ముక్కోటి ఏకాదశి నాడు అన్నం తినకూడదు.
2. అన్నం ఒక్కటే కాదు ఉల్లిగడ్డ, వెల్లుల్లి కూడా తినకూడదు. అలాగే మాంసాహారం కూడా వైకుంఠ ఏకాదశి నాడు తినకూడదు.
3. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు సమయం కంటే ముందే ఉపవాస దీక్షను విరమించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. .
4. పూజా ఫలం దక్కాలంటే ఈ రోజు ఎవ్వరితోనూ చెడుగా మాట్లాడకూడదు. ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలి. మర్యాదగా మాట్లాడాలి.