ఒక వ్యక్తి మరణ సమయం ప్రారంభమైనప్పుడు అతని నాభి చిన్నదిగా మారుతుంది. నాభి శరీరానికి కేంద్రంగా పరిగణిస్తారట.. జననం, మరణం నాభితో అనుసంధానించి ఉంటాయట. మరణానికి ముందు, వ్యక్తి దృష్టికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాడు. అతను నక్షత్రాలు , సూర్యుని చూడటం మానేస్తాడు. అంతేకాదు ఇంద్ర ధనస్సు రాత్రిపూట కనిపిస్తుందని చెబుతారు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపించడం ప్రారంభిస్తే, వ్యక్తి మరణానికి దగ్గరగా ఉంటాడని అర్థమట.