రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో జరుపుకోనున్నారు. అయితే భద్రకాలం ఆగస్టు 20 న రాత్రి 09:02 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. ఈ సమయం దటినప్పటి నుంచి రాఖీని కట్టొచ్చు. ఆగస్టు 31న ఉదయం 07.05 గంటల వరకు రాఖీ కట్టడానికి మంచి సమయం. ఈ సమయంలో అక్కా చెల్లెల్లు తమ సోదరుడికి రాఖీ కట్టొచ్చు. అయితే రాఖీ కట్టే సమయంలో అక్కాచెల్లెళ్లు దిశను జాగ్రత్తగా చూసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పగటిపూట మాత్రమే కాదు రాత్రివేళల్లో కూడా దిశా నిర్దేశం చేయాలట. డైరెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సోదరుడికి సుఖసంతోషాలు, అదృష్టం వరిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దిశతో సహా రాఖీ కట్టే ఇతర నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం.