శారదా నవరాత్రులలో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు. ఈ రోజు భక్తులు ఆమెకు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి నిష్టగా పూజిస్తారు. స్కందమాత మహిమ గురించి శివ పురాణంలో వివరంగా చెప్పబడింది. పార్వతీదేవిని పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మోక్షాన్ని పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు కూడా స్కందమాత అనుగ్రహం పొందాలనుకుంటే నవరాత్రులలో ఐదో రోజున స్కందమాతను ఆరాధించండి. అలాగే పూజ సమయంలో ఈ వ్రత కథను చదవండి.