ఇన్ని లోకాలను నడిపిస్తున్న ఆ సర్వేశ్వరుడికి ఎవరి శక్తి మేరకు వారు కృతజ్ఞత చూపించడం కోసం మహాశివరాత్రి రోజు వివిధ రకాల పూజలు చేస్తారు. కొందరు కొబ్బరి కాయలు, అరటిపళ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. మరికొందరు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వంటి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. మరికొందరు వివిధ రకాల పండ్ల రసాలతో స్వామి వారిని అభిషేకిస్తారు.