దేవతల దేవుడైన మహాదేవుని రూపం ఎంతో దివ్యమైనది, పవిత్రమైనది. సనాతన ధర్మంలో సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున పరమేశ్వరున్ని పూజిస్తారు. ఈ రోజు శివుడిని పూజించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. దీంతో మన కష్టాలన్నీ తొలగిపోతాయి. జ్యోతిషశాస్త్రంలో.. సోమవారం నాడు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీటివల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇళ్లు ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. జీవితంలో విజయం కూడా సాధిస్తారు. ఇందుకోసం ఈ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.