Powerful Mantra: ప్రతిరోజూ ఉదయాన్నే ఇవి చదివితే.. మీ సమస్యలన్నీ తీరిపోయినట్లే..!

Published : Sep 02, 2025, 10:11 AM IST

కేవలం కొన్ని రకాల మంత్రాలు జపించడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. మరీ ముఖ్యంగా... భార్యభర్తల మధ్య తగాదాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

PREV
13
Mantra

జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కోసారి అనుకోని సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో అశాంతి, అప్పుల బాధలు.. ఇలా చాలా సమస్యలు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నట్లయితే... కేవలం కొన్ని రకాల మంత్రాలు జపించడం వల్ల చాలా రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. మరీ ముఖ్యంగా... భార్యభర్తల మధ్య తగాదాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. మరి ప్రతిరోజూ ఎలాంటి మంత్రాలు జపించాలో ఇప్పుడు చూద్దాం...

23
కోరికలు తీర్చే మంత్రాలు...

భాగవంతంలోని వ్యాసుని ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే నవమి తిథి రోజున దుర్గాదేవిని పూజిస్తే... కోరుకున్న కోరికలన్నీ నిజమౌతాయి. ఈ సమయంలో దుర్గాదేవిని పూజించే వ్యక్తి కి జీవితాంతం ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలంటే....

ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ... ప్రశాంతత లేనట్లుగా అనిపిస్తే శాంతి మంత్రాన్ని జపించాలి. ఈ శాంతి మంత్రాన్ని జపించే ముందు, లోతైన శ్వాస తీసుకోండి. తరువాత ఒక ప్రదేశంలో కూర్చుని ''ఓం శాంతిః శాంతిః శాంతిః'' అనే శాంతి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా సరళమైన మంత్రం అయినప్పటికీ, ఈ మంత్రం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మీ మనస్సును ప్రశాంతపరిచే శక్తిని కలిగి ఉంది.

33
కుటుంబ అశాంతిని తొలగించడానికి...

ఇంటి నుండి అశాంతిని తొలగించడానికి, ఇంట్లో కుటుంబ వివాదాలను తొలగించడానికి, మీరు ఇక్కడ సూచించిన కొన్ని శక్తివంతమైన మంత్రాలను పఠించాలి. కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి, మీరు ''అంబికాయే నమః'', ''శ్రీమ్ నమః'', ''హ్రీమ్ నమః'', ''పర్వతయే నమై'', ''గౌర్యై నమః'' ''శంకరప్రాయై నమః'' అని జపించాలి. ఈ మంత్రాలను జపించాలి. వీటిని జపించడం వల్ల శాంతి కలుగుతుంది.

మంచి ఆరోగ్యం కోసం..

మీ ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటే, మీకు మంచి ఆరోగ్యం కావాలంటే, అలాంటి సందర్భంలో మీ మనస్సులో మంచి ఆరోగ్య భావనను పొందాలనే కోరికతో లోతైన శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి చెందిన హనుమాన్ చాలీసా నుండి ఈ ఒక పంక్తిని పఠించండి. ''నసై రోగ హరై సబ పీర, జపత సంగధన్ హనుమత బీర''. ఈ ఒక పంక్తిని పఠించండి.ఈ అద్భుతమైన మంత్రం మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. హనుమాన్ చాలీసా నుండి ఈ ఒక పంక్తిని ప్రతిరోజూ 10 సార్లు పఠించాలి.

ఈ మంత్రాలన్నింటినీ ఎలా జపించాలి?

మీరు ఎల్లప్పుడూ కొంతకాలం నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠించడానికి నిశ్శబ్ద ప్రదేశం మాత్రమే కాదు, ప్రశాంతమైన మనస్సు కూడా అవసరం. మీరు ఏ శుభ్రమైన ప్రదేశంలోనైనా కూర్చుని ఈ మంత్రాలను పఠించవచ్చు. మంత్రాన్ని పఠించే ముందు, మీ మనస్సులో శ్రీమన్నారాయణుడిని తలుచుకోండి. ఆ తర్వాత ఈ మంత్రాలను జపించండి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవ్వడం వల్ల... మీ సమస్యలన్నీ తీరిపోయి.. సంతోషం నెలకుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories