గోవర్ధన పూజ ప్రాముఖ్యత
ఈ రోజున శ్రీకృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని, గోమాతను పూజిస్తారు. గోవర్ధన పూజ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ రోజు గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణునికి ఇష్టమైన ఆవులను పూజిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ పురాణాల ప్రకారం.. ఈ రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడి కోపం నుంచి బృందావన ప్రజలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిలో ఎత్తుతాడు. అప్పటి నుంచి గోవర్ధన పర్వతాన్ని పూజించడంతో పాటుగా శ్రీకృష్ణుడిని ఈ రోజు పూజించడం ప్రారంభించారు. కాగా కన్నయ్యను గోవర్ధనదారి, గిరిధారి అని కూడా పిలుస్తారు.