అయితే రావణుడిని చంపినందుకు గాను బ్రాహ్మణులను చంపిన పాపం రాముడికి ఉంటుంది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు దేవతల దేవుడైన శివుడి కోసం కఠిన తపస్సు చేస్తాడు. దీంతో శివుడు శ్రీరాముడికి నీలకంఠ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ప్రతి ఏడాది అశ్విని మాసం శుక్ల పక్షం పదవ రోజున అంటే దసరా రోజున పాలపిట్ట పక్షిని చూడటం పవిత్రంగా భావిస్తారు. పాలపిట్టను చూడటం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయని నమ్ముతారు.