diwali 2023: సనాతన ధర్మంలో దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దీపావళి పండును ప్రతి ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటాం. ఈ రోజు ఎంతో పవిత్రమైనది. అందుకే దీపావళి నాడు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. అనుకున్న పనిలో విజయం సాధించడానికి దీపావళి నాడు చాలా మంది అమ్మవారికి పూజ చేసే వరకు ఉపవాసం కూడా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు. అందుకే ప్రతి శుక్రవారం నాడు మరువకుండా అమ్మవారికి పూజలు చేస్తారు. ముఖ్యంగా దీపావళి నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. అలాగే మీ సంపద పెరుగుతుంది. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. మీ సంతోషం, అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతాయని పురాణాలు చెబుతున్నారు.