లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు సరైన దిశలో..
దీపావళి రోజూ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను సరైన దిశలోనే పెట్టాలి. కానీ చాలా మంది పూజ హాడావుడిలో ఉండి ఈ విషయాన్నే పట్టించుకోరు. జ్యోగిష్యలు ప్రకారం.. ఈ దేవుళ్ల విగ్రహాలను సరైన దిశలో పెట్టకుంటే మీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీపావళి పూజకోసం లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టండి. ఈ దిశలోనే దేవతలు నివసిస్తారని నమ్ముతారు.