Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి

Published : Jun 05, 2026, 05:46 PM IST

కోల్పోయిన ఆస్తులు, సంపదలు తిరిగి పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ ఆలయాన్ని తప్పక దర్శించాల్సిందే. ఇంతకూ అంత మహిమాన్విత ఆలయమేది..? దాని విశేషాలేంటి..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
అరియనాథ ఆలయ విశేషాలు

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా హరికేశవనల్లూరులో కొలువైన అరుదైన పుణ్యక్షేత్రం అరుల్మిగు అరియనాథ స్వామి ఆలయం. సుమారు 1100 నుండి 1600 సంవత్సరాల పురాతనమైనది ఈ దేవాలయం. ఇక్కడ కొలువైన శివుడు 'అరియనాథర్' గా దర్శనమిస్తాడు. ఈ పురాతన ఆలయానికి చాలా చరిత్ర ఉంది… ఎన్నో ప్రత్యేకతలు కలిగివుంది.  

24
శనీశ్వరుడి భార్య, పిల్లలకు ఆలయం..

శనీశ్వరుడి భార్య జ్యేష్ఠా దేవికి ఇక్కడ అరుదైన ఆలయం ఉంది. ఆమె విగ్రహం తన పిల్లలు మాంతన్, మాంతిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. పిల్లలకు జ్వరం తగ్గడానికి ఇక్కడి సురదేవుడిని పూజిస్తారు. 

34
కుబేరుడికి సిరిసంపదలు ఇచ్చిన ఆలయం..

గర్భగుడిని ప్రతిష్ఠించిన కుబేరుడు ప్రాకారం చివరన కనిపిస్తాడు. ఆయన పక్కనే ఉన్న ఒక రాతి కిటికీ నుంచే అరియనాథుడితో మాట్లాడేవాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు కుబేరుడికి అపార సంపదను ఈ అరియనాథుడే ప్రసాదించాడని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయంలో సప్తమాతృకలు, దక్షినామూర్తి, కాశీ విశ్వనాథర్, కన్ని గణపతి, భారీ ముక్రుణి వినాయకుడు కూడా ఉన్నారు. అమ్మవారు పెద్దనాయకి 7 అడుగుల ఎత్తులో నిలబడిన భంగిమలో దర్శనమిస్తారు.

44
అరియనాథుడి అనుగ్రహం పొందే మార్గం

ఈ అరియనాథ ఆలయం తిరునల్వేలి నుంచి గంట ప్రయాణ దూరంలో ఉంది. గుడికి గోపురం లేకపోయినా ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. జీవితంలో కోల్పోయిన కీర్తి, ఆరోగ్యం, సంపద లేదా పలుకుబడి ఏదైనా సరే, అరికేసనల్లూరు అరియనాథుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఆ కుబేరుడి కిటికీ, జ్యేష్ఠా దేవి ఆలయాన్ని దర్శించుకుంటే అన్నీ తిరిగి సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

Read more Photos on
click me!

Recommended Stories