ఇకపోతే అమావాస్య నాడు శ్మశానవాటికలు వంటి చీకటి, నిర్మానుశ్య ప్రదేశాలకు వెళ్లకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు పనిచేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
శాస్త్రాల ప్రకారం.. ప్రతి అమావాస్య రోజున మన పూర్వీకులు తమ ఇండ్లకు సందర్శిస్తారట. అందుకే ఈ రోజున దానధర్మాలు చేయాలని జ్యోతిష్యులు చెబుతారు.
ప్రతి అమావాస్య నాడు ఆవుకు 5 రకాల పండ్లను, గోధుమ ఉండలను పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది.