తెలంగాణలో కరోనా సంక్షోభం: కేసీఆర్ కు తమిళిసై చేతుల్లో చుక్కలు

First Published Jul 7, 2020, 11:38 AM IST

కేసీఆర్ స్క్రీన్ మీద లేకపోవడంతో...  నిన్నొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గవర్నర్ తమిళసైసౌందరరాజన్ యాక్టీవ్ అయ్యారు. కేసీఆర్ అందుబాటులో లేరు అనే విషయం ట్రెండ్ అవుతుంది అనగానే ఆమె యాక్టీవ్ అయ్యారు. 

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. హై కోర్టు నుంచి మొదలుకొని కేంద్రం వరకు తెలంగాణ సర్కార్ పై వేలెత్తిచూపని వారు లేరు. తెలంగాణాలో వారం రోజుల్లో50 వేల టెస్టులను ప్రభుత్వం సంకల్పించింది. కానీ ఆ 50 వేల పరీక్షల నిర్వహణకు 2వారల పైచిలుకు సమయమే పట్టింది.
undefined
ఇక కరోనా వైరస్ సామాన్యుడు సెలబ్రిటీ అన్న తేడా లేకుండా అందరికీ సోకుతుంది. కరోనా వైరస్ చివరకు ప్రగతిభవన్ కి కూడా పాకింది. దాదాపుగా 30 మంది సిబ్బంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఏకంగా కేసీఆర్ ప్రగతి భవన్ ని విడిచి ఫార్మ్ హౌజ్ కి మకాం మార్చారు.
undefined
కరోనా విజృంభిస్తున్న వేళ కేసీఆర్ కనబడకుండా పోయారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ గగ్గోలు పెడుతున్నారు. వేర్ ఈజ్ కేసీఆర్ అని ట్రెండ్ చేస్తున్నారు. అధిక కేసులు బయటపడుతుండడంతో పాటుగా మరణాల రేటు కూడా ఎక్కువగా నమోదవుతుంది.(దేశ సరాసరితోని పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ... జీనోమ్ వాలీ ఇక్కడే ఉండి, ధనిక రాష్ట్రమయి ఉండి, దేశానికే దారి చూపే మార్గదర్శి ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాత్రం ఈ స్థాయి మరణాలు ఆందోళన కలిగిస్తున్న విషయమే)
undefined
కేసీఆర్ స్క్రీన్ మీద లేకపోవడంతో...నిన్నొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గవర్నర్ తమిళసైసౌందరరాజన్ యాక్టీవ్ అయ్యారు. కేసీఆర్ అందుబాటులో లేరు అనే విషయం ట్రెండ్ అవుతుంది అనగానే ఆమె యాక్టీవ్ అయ్యారు.
undefined
గత కొన్నిరోజులుగానే ఆమె కరోనా కేసుల విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ట్విట్టర్ లో అతి తక్కువ టెస్టులను నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానాల్లో ఉందని ట్వీట్ చేసారు. దాన్ని తమిళిసై రీట్వీట్ చేసారు. తెలంగాణాలో కరోనా పరిస్థితులపై తనకు కలవబరపడుతున్నానంటూ కూడా మరో ట్వీట్ చేసారు.
undefined
ఇక నిన్న ఏకంగాసాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి రావాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టినట్లు తెలిసింది. స్వయంగా తమిళిసై ఇదే విషయాన్నీ ట్విట్టర్ లో తెలిపారు కూడా. కానీ సదరు అధికారులు రాలేదు.వేరే ముఖ్యమైన పనులు ఉండడం వల్ల రాలేకపోతున్నామని చెప్పారు. గవర్నర్ పిలిస్తే అధికారులు రాకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించే సాహసం ప్రభుత్వాధికారులు చేయలేరు. ముఖ్యంగా ఇలా ఐఏఎస్ క్యాడర్ కి చెందినవారు అస్సలు చేయలేరు( వారికి రాష్ట్రప్రభుత్వంతోపాటుగా కేంద్రం కూడా బాసే)
undefined
నిన్న తమిళిసై గారు రమ్మని చెప్పిన అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులు, స్వయంగా సీఎంకనుసన్నల్లో పనిచేస్తారు. వారు ఎట్టిపరిస్థితుల్లోనూ గవర్నర్ ఆదేశాలను ధిక్కరించలేరు. ఒకవేళ అత్యవసరమైన పని ఉన్నా కూడా దాన్ని వేరే అధికారిని పంపించి తెలియజేస్తారు. గవర్నర్ కి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకు అవసరమైన సమాచారాన్ని అధికారులు వెళ్లి ఇవ్వాలి. స్వయంగా ఇవ్వలేకపోతే.... వేరే అధికారికి పూర్తి సమాచారం అందించి అక్కడకు పంపించి చెప్పవలిసి ఉంటుంది. కానీ రాజ్ భవన్పిలుపుపై నిన్న ధిక్కార స్వరాన్ని వినిపించారు ఇద్దరు ఉన్నతాధికారులు.
undefined
సీఎంకి తెలియకుండా, తెలియజేయకుండా గవర్నర్‌ ఆదేశాలను ధిక్కరించే సాహసం చేయరు, చేయలేరు అధికారులు. అందునా వారు సీనియర్లు.వెళ్లలేని పరిస్థితి ఉంటే, వేరే అధికారాన్ని పంపించాల్సిన సాంప్రదాయాన్ని సైతంసోమేశ్‌ కుమార్‌, శాంతి కుమారి పాటించలేదని తెలుస్తోంది..
undefined
నిన్న సాయంత్రంఎర్రవల్లిలోని ఫామ్‌హౌ్‌సలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి కలిశారు. వారిద్దరూ రెండు గంటలపాటు సీఎంతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఎం మాట్లాడారు అనే విషయంపై స్పష్టమైన అవగాహన లేకున్నప్పటికీ... ఖచ్చితంగా గవర్నర్ పిలుపు విషయమై చర్చమాత్రం జరిగే ఉంటుంది.
undefined
తొలుత తమిళిసై వచ్చినప్పుడు అందరూ ఇక కేసీఆర్ కి చుక్కలే అని అన్నారు. కారణం ఆమె ఒక యాక్టీవ్ పొలిటీషియన్. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెంది వచ్చారు. తమిళనాడు బీజేపీ యూనిట్ చీఫ్ గా ఉన్నప్పుడే గవర్నర్ గానియమితులయ్యారు. ఆమె రాక తెలంగాణాలో కేసీఆర్ కు పక్కలో బల్లెం అని అందరూ అన్నారు. మరో కుముద బెన్ జోషి అని కూడా అన్నారు.
undefined
కానీ ఆమె మాత్రం కేసీఆర్ అనేక నిర్ణయాలను స్వాగతించారు. కేసీఆర్ ని పొగిడారు. కేసీఆర్ కార్యక్రమాలు చాలా గొప్పవి అని అన్నారు. ఆర్టీసీ సమ్మె అప్పుడు కూడా గవర్నర్ ఆక్టివ్ అవుతున్నారు అని అందరూ అన్నారు. కానీ ఆమె మాత్రం పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించుకోండి అనిప్రభుత్వానికే వదిలేసింది.
undefined
స్వతహాగా డాక్టర్ అయిన తమిళిసై కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె వ్యాఖ్యలని తరచుగా చేస్తున్నారు. టెస్టింగుల విషయం నుంచి మొదలుకొని ఆసుపత్రుల్లోని ట్రీట్మెంట్ వరకు అన్నింటిపై ప్రభుత్వాన్ని ఎత్తి చూపడంతోపాటుగా సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు.
undefined
ఆమె సలహాలు సూచనలు చేస్తుండడంతో ప్రజలు సైతం ప్రభుత్వానికి చెప్పినాపట్టించుకోని విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్తుండడం, ఆమె ఆ విషయాలపై ప్రభుత్వ అధికారులను అడగడం జరుగుతున్నాయి. దీనిపై తెరాస అధిష్టానం, నాయకులూ ఒకింత అసహనంతో ఉన్నట్టుగా తెలియవస్తుంది. ఆమె ఇటీవల నిమ్స్ హాస్పిటల్ సందర్శన కూడా ప్రభుత్వ వర్గాల్లో మింగుడు పడనిఒక విషయం.
undefined
ఆమె డాక్టర్ కూడా అవడంతో... అందరిని చాలా ఈజీగా నీకు ఎం తెలిసి మాట్లాడుతున్నావు అని ప్రశ్నించే ప్రభుత్వ వర్గాలు ఆమెను అనలేకపోతున్నాయి. ప్రభుత్వంలోనివారి కన్నా దీనిపై ఎక్కువ అవగాహన ఉన్నదిగవర్నర్ కే. వారిని అంత ఈజీగా కొట్టిపారేయలేరు.
undefined
గవర్నర్ కేంద్రంలోని బీజేపీకి గొంతుకయ్యారు అనేది ప్రభుత్వ వర్గాల భావన. రాష్ట్రంలో తెరాస ను కౌంటర్ చేసి ఇక్కడ జెండా పాతాలని యోచిస్తున్న బీజేపీ గవర్నర్ ద్వారా ఈ పలుకులన్నీ పాలిస్తున్నారని అధికార వర్గం భావిస్తోందట. తమిళిసై అందుకే ప్రభుత్వాన్ని మరింతగా ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
undefined
ఈ పరిస్థితుల వల్ల సీఎం, గవర్నర్ కార్యాలయాల మధ్య గ్యాప్ పెరిగిందని, గవర్నర్ పిలిచినా వారు వెళ్ళకపోవడం కూడా ఇందులో భాగమే అని అంటున్నారు. ఈ సోషల్ మీడియా థియరీలు అన్నిటినీ పక్కనపెడితే... రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ ఈ వివాదానికి కారణభూతులయింది స్వయానా ముఖ్యమంత్రి గారే. ఆయన ఫార్మ్ హౌస్ లో ఉన్నారు. ప్రగతి భవన్ కి కూడా కరోనా సెగ తగిలింది.
undefined
ప్రజలు ఇలా ఇబ్బది పడుతున్నప్పుడు ఆయన బయట తిరగకపోతే పోయారు, కనీసం ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రజలకు తాను అండగా ఉన్నాను అన్న అభయంఅయినా ఇవ్వాల్సింది. కానీ అది జరగడంలేదు. వదంతులు కూడా తోడవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ఖాళీ అవుతోంది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజల మధ్యకొచ్చి పరిస్థితులను సమీక్షిస్తే బాగుండునని కోరుకుంటున్నారు.
undefined
click me!