స్వయంకృతం: సర్దార్ ను మోడీకి, పీవీని కేసీఆర్ కు వదిలేసిన కాంగ్రెస్

First Published Jul 5, 2020, 9:44 AM IST

టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా  పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. 

జూన్ 28 నుండి పీవీ నరసింహ రావు శతజయంతి ప్రారంభమయ్యాయి. సాధారణంగా పీవీ నరసింహారావు మన తెలుగు బిడ్డ అయినప్పటికీ.... ఆయన జయంతి దినోత్సవం మనలో చాలా మందికి తెలియదు. ఈసారి శతజయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరపాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించడంతో ఈ విషయం ఇప్పుడు అందరికి తెలిసింది.
undefined
టీవీల్లో ప్రతిరోజు పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాల యాడ్స్ మనకు కనబడుతున్నాయి. (లాక్ డౌన్ కాలంలో తెలంగాణ ప్రభుత్వం మీడియా సంస్థలకు ఒకింత మేలు చేసిందని చెప్పాలి)ఉదయం నుండి ఏ ఛానల్ చూసినా పీవీ నరసింహ రావు తెలంగాణ జాతి ముద్దు బిడ్డ అని, తొలి దక్షిణ భారతదేశ ప్రధాని అని తెలంగాణ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
undefined
కేసీఆర్ ఇలా పీవీ నరసింహారావు ను తెలంగాణ ముద్దుబిడ్డగా ప్రకటించడం వెనుక కారణాల గురించి అందరూ తెగ యోచనలు చేస్తున్నారు. పీవీ నరసింహ రావు వాస్తవానికి కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన మంత్రి అయ్యాడు. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. అయినా కేసీఆర్ ఇలా ఎందుకు పీవీ నరసింహారావు ను ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అందరి మెదళ్లలోనూ తిరుగుతున్న ప్రశ్న.
undefined
దీనిని మనం అర్థం చేసుకోవాలి అంటే.... ఒక రెండు సంవత్సరాల కిందకు వెళ్ళాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని బీజేపీ ప్రభుత్వంగుజరాత్ లో ఏర్పాటు చేసింది. పటేల్ గారు కూడా కాంగ్రెస్ నేతే. హోమ్ మంత్రిగా దేశాన్ని ఏకం చేసారు. అలాంటి కాంగ్రెస్ నేతను బీజేపీ పూర్తిగా సొంతం చేసేసుకుంది.
undefined
కాంగ్రెస్ పార్టీ ఆయనను అనేక కారణాల వల్ల ప్రొజెక్ట్ చేయలేకపోయింది. బీజేపీ పూర్తిగా ఆయనను సొంతం చేసుకుంది. జాతీయ సమగ్రతకు చిహ్నంగా బీజేపీ ఆయనను ప్రొజెక్ట్ చేసింది. పూర్తిగా పటేల్ కాంగ్రెస్ నేత అయినా ఆయన ఇప్పుడు ఒక బీజేపీ ఐకాన్.
undefined
ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదే తరహాలో పీవీనరసింహ రావు ను వాడుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే ఆయననుప్రొజెక్ట్ చేస్తున్నారు. పీవీ నరసింహ రావునుతెలంగాణ ఐకాన్ గా జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటివరకు తెలంగాణకు జాతీయస్థాయి నాయకుడు ఎవ్వరు లేరు. ఆ కొరతను ఇప్పుడు పీవీ ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నారు కేసీఆర్.
undefined
ఇంకో అంశం పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల ప్రోజెక్ట్ చేయడానికి ఇష్టపడదు. ఆయనకు సోనియా గాంధీ కి అస్సలు పడదు అన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ వారికున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని ఆయన ఆయన పీవీని తెలంగాణ సిమ్బల్ గా, తెలంగాణ సెంటిమెంటును ఇప్పటికే కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్న తెరాస ఐకాన్ గా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది.
undefined
కాంగ్రెస్ కాలగర్భంలో గతించిన నాయకులను వెలికితీసి తమ సింబల్స్ గా చూపెట్టుకునే బీజేపీ కన్నా ముందుగా పీవీని సొంతం చేసుకోవాలని కుంటున్నారు కేసీఆర్. పీవీని మరో పటేల్ లాగ బీజేపీ చేతికి అందించొద్దుఅనుకోవడంతో పాటుగా పీవీని తన పార్టీ పటేల్ లాగా ఒక చెరగని ముద్ర వేయాలని చూస్తున్నాడు.
undefined
పీవీ నరసింహ రావు ను నిలబెట్టడం ద్వారా ఆయన బీజేపీ హిందుత్వ రాజకీయాలకు కూడా అడ్డుకట్టవేయాలని అనుకుంటున్నాడు. పీవీకి బలమైన హిందుత్వ వాది అనే ముద్ర కూడా ఉంది(బాబ్రీ మసీద్ కూల్చివేత విషయంలో). దాన్ని ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి తెలంగాణాలో కౌంటర్ ఇవ్వడానికి వాడుకుందామని అనుకుంటున్నారు.
undefined
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కి చెందిన పటేల్ ని కాంగ్రెస్ మీదకే ఆయుధంగా ఎత్తి, ఆయనను ఒక బీజేపీ ఐకాన్ గా మార్చి వాడుకుంది మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ సైతం అదే లెవెల్ లో పీవీని ప్రాజెక్ట్ చేసి ఆయనను తెలంగాణ సెంటిమెంటునుఐకాన్ గా ప్రాజెక్ట్ చేయాలనీ చూస్తుంది కేసీఆర్ సర్కార్.
undefined
ఇక్కడ కేసీఆర్ చూడబోతుంటే..... బీజేపీ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు. బీజేపీ పటేల్ ని కేవలం కాంగ్రెస్ మీదనే ఎక్కుపెడితే... కేసీఆర్ మాత్రం పీవీ నరసింహ రావు ని ఏకంగా ఇటు బీజేపీ మీద, అటు కాంగ్రెస్ మీద ఇద్దరి మీద ఎక్కుపెట్టారు.
undefined
click me!