అయితే, తాను జగన్ తో సమావేశమైతే తన అభిమానులకు, టీడీపీ అభిమానులకు, నందమూరి హీరోల అభిమానలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతే జూనియర్ ఎన్టీఆర్ తప్పుకుని ఉండవచ్చునని అంటున్నారు. జగన్ తో భేటీకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ తీవ్రమైన విమర్శలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. దానికి తోడు, తన బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును వ్యతిరేకించినట్లు అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వారితో మరిన్ని విభేదాలను కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేరని, అందుకే ఆయన చివరి నిమిషంలో తాడేపల్లి పర్యటన నుంచి తప్పుకున్నట్లు భావిస్తన్నారు.