మా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చిరంజీవి పెళ్లి సందD సినిమా వేడుకల్లో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇరు వర్గాల మధ్య తేడాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తాయి. చిన్న పదవుల కోసం పరువు తీసుకోవద్దని చిరంజీవి వ్యాఖ్యానించారు. తనను ఎన్నిసార్లు వారు రెచ్చగొట్టారనేది పెద్ద విషయం కాదని, తాను హుందాగా మౌనం పాటిస్తూ వస్తున్నానని, అయితే తన మౌనం అసమర్థత కాదని మోహన్ బాబు అన్నారు.