నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. టిడిపి, జనసేన కూటమిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ కానుంది. ఆ కూటమిని ఎదుర్కోవడం ఆయన కష్టమైన పనే కావచ్చు. జనసేన, టిడిపి ఓట్లు కలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు కోసం చాలా కష్టపడాల్సి రావచ్చు