జులై 2వ తేదీన జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు. ఈ స్థితిలో సభ ఎలా జరగుతుందో కూడా మాణిక్ రావు థాక్రే వివరించారు. శ్రీనివాస్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో కలిసి పని చేసే విధంగా ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మొత్తం మీద, కాంగ్రెస్ తెలంగాణ నాయకుల విభేదాలకు చెక్ పెట్టే విధంగా రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.