కరోనా కట్టడి: నిలిచిన వైఎస్ జగన్, తేలిపోయిన కేసీఆర్

First Published Jun 12, 2020, 11:01 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతుండడంతో... ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ ని చూసి నేర్చుకోండి. తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విపరీతంగా నమోదవుతున్నాయని అన్నారు. 

కరోనా వైరస్ పై పోరులోతెలంగాణ రాష్ట్రం ముందుందంటూ కేసీఆర్ అనేక ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పారు. దేశమంతా లాక్ డౌన్ విధించేకన్నా ముందే తెలంగాణాలో లాక్ డౌన్ ను విధించారు. మద్యం షాపులకు కూడా కేంద్ర ఆదేశాల తరువాత పరిస్థితిని సమీక్షించే అనుమతులను ఇచ్చారు.
undefined
లాక్ డౌన్ ముగిసేనాటికి కరోనా కేసులు ఉండకూడదు అంది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అంటూ సమరశంఖం ఊదారు. ప్రజలంతా కేసీఆర్ వెంట నడిచారు. లాక్ డౌన్ కి అన్ని విధాలుగా పూర్తి సహకారాన్ని అందించారు.లాక్ డౌన్ కాలంలో కూడా కరోనా పరీక్షలు తెలంగాణాలో తక్కువగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వచ్చినప్పటికీ... తనదైన శైలిలో వాటిని కొట్టిపడేస్తూ... అవి అవాస్తవ చిల్లర రాజకీయ ఆరోపణలు అని అన్నారు.
undefined
పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతుండడంతో... ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ ని చూసి నేర్చుకోండి. తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విపరీతంగా నమోదవుతున్నాయని అన్నారు.
undefined
ఇదే విషయాన్నీ కొన్ని పత్రికలు కూడా రాశాయి. తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి, ప్రభుత్వ వర్గాల చర్యల వల్లే ఇది సాధ్యమయ్యిందని కూడా అందరూ అన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం సాగింది.
undefined
కానీ గాంధీ ఆసుపత్రి వైద్యులు రోడ్డెక్కడంతో తెలంగాణాలో కరోనా పరిస్థితిపై అనేక విషయాలు బయటకు వచ్చాయి. వారు లేవనెత్తిన సమస్యలను చూస్తుంటే... తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
undefined
తెలంగాణాలో టెస్టింగులు తక్కువగా చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి నుంచి మొదలు హై కోర్టు వరకు ప్రభుత్వాన్ని తలంటినప్పటికీ.... వారు ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. డాక్టర్లు స్వయంగా తమకు కూడా పరీక్షలు చేయడంలేదని చెపుతుంటే.... పరిస్థితి ఎంత భయంకరంగాఉందొ అర్థమవుతుంది.
undefined
ఆ వైరస్ కనీసం ఇంకో సంవత్సరం పాటు ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల బ్రతికే ఉంటుంది. టీకా వచ్చే వరకుఈ కరోనా వైరస్ కి అంతం లేదు. అంతవరకు ఈ వైరస్ తో మనం సహజీవనం చేయక తప్పదు. అదే విషయాన్నీఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.ఆయన ఆ విషయం అనగానేప్రతిపక్షాలు ఆయనమీదతీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాయి. కరోనా ఉన్నప్పటికీ... రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తాను అంటున్నాడు అంటూ తీవ్ర స్థాయిలోవిరుచుకుపడ్డారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టింగ్ విపరీతంగా చేస్తున్నారు. రాష్ట్రంలోకి వేరే ఎవరైనా కొత్తవారు వస్తే రాష్ట్రంలోని గ్రామ వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తున్నారు. వారు వచ్చి శాంపిల్ ని తీసుకొని వెళ్తున్నారు.అలా శాంపిల్ కలెక్ట్చేసిన తరువాత ఫలితం పాజిటివ్ ఆ నెగటివ్ ఆ అనే విషయం మొబైల్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినా రాకపోయినా... ఇంటిముందుకు అంబులెన్సు, పోలీస్ జీప్ వస్తే ఆ సదరు వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు. లేదంటే కరోనా వైరస్ లేనట్టు.
undefined
అదే తెలంగాణ విషయంలో కరోనా వైరస్ పరీక్షలు చేయమని అడిగినప్పటికీ కూడా చేయడంలేదు. ఇంతకుమునుపన్నా రాష్ట్రంలోకి వచ్చినవారికి హోమ్ క్వారంటైన్ అనే స్టాంప్ వేశారు. ఇప్పుడు అది కూడా లేదు.పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరికీ కరోనా వైరస్ సోకుతుంది. కరోనా దెబ్బకు తెలంగాణ ప్రజానీకం విలవిల్లాడిపోతోంది. గాంధీ వైద్యులు రోడ్డెక్కడంతో ప్రజలు ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలనపై వచ్చిన అనేక ఆరోపణలను కూడా పోల్చి చూసుకుంటున్నారు.
undefined
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నప్పటికీ... అక్కడ కరోనా పరీక్షలు అధికంగా చేస్తున్నారు. ఎక్కడా కూడా భేషజాలకు పోలేదు. పరీక్షలను చేయడమే కాకుండా వికేంద్రీకరించి ఎక్కడికక్కడ కరోనా చికిత్సను అందిస్తున్నారు.
undefined
ప్రజలు అక్కడ జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్విరామపోరాటం సాగిస్తుంది. కానీ తెలంగాణాలో మాత్రం పరీక్షలను నిర్వహించడం లేదు. శవాలకు పరీక్షలు నిర్వహించడంలేదు.
undefined
ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ హ్యాండ్లింగ్ విషయంలో ముందున్నది అనిపించక మానదు. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో విజయవాడలోని దాదాపు 70 శాతాన్ని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి అక్కడ చర్యలను తీసుకుంటున్నారు.
undefined
click me!