చంద్రబాబుపై మరో పిడుగు: పాత గొడవను పైకి తెచ్చిన కేశినేని నాని

First Published Sep 25, 2021, 6:00 AM IST

ఇటీవలే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. చివరకు చంద్రబాబు బుజ్జగింపుతో ఆయన వెనక్కి తగ్గారు. తాజాగా కేశినేని నాని వ్యవహారం ముందుకు వచ్చింది.

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు వర్గాలకు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొన్నాయి.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై మరో పిడుగు పడింది. సీనియర్ నేత, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చంద్రబాబుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను గానీ తన కూతురు గానీ పోటీ చేయబోమని ఆయన బాంబు వేసినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడం చంద్రబాబు తలనొప్పిగానే పరిణమించవచ్చు.

gorantla

ఇటీవలే సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. స్థానికంగా ఇతర టీడీపీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అందుకు సిద్ధపడ్డారు. దాంతో చంద్రబాబు తరఫున పలువురు నాయకులు రాయబారాలు నెరిపి బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చివరకు చంద్రబాబు బుజ్జగింపుతో ఆయన వెనక్కి తగ్గారు. తాజాగా కేశినేని నాని వ్యవహారం ముందుకు వచ్చింది.

chandrababu

ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఢీకొట్టడం ఏ విధంగానో తెలియక సతమతమవుతున్న చంద్రబాబుకు పార్టీ అంతర్గత వ్యవహారాలు తలనొప్పిగా మారాయి. సీనియర్లు అసంతృప్తి గురి కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వైఎస్సార్ కాంగ్రెసు గాలీలో కూడా విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని నాని విజయం సాధించారు. అటువంటి నేత అసంతృప్తికి గురై తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే టీడీపీ పెద్ద దెబ్బనే అవుతుంది. 

Kesineni Swathi

కేశినేని పాత గొడవను తెరపైకి తెచ్చి చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు కేశినేని నానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాళ్లు విరగ్గొడుతామని కూడా వారు వ్యాఖ్యానించారు. కేశినేని తన కూతురు శ్వేతను కార్పోరేషన్ మేయర్ పదవికి ప్రతిపాదించారు.

బీసీ వర్గానికి చెందిన పూజిత తండ్రి గుండారపు హరిబాబు గతంలో నగరపాలక సంస్థలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా కూడా పని చేశారని, ఇప్పుడు ఆయన కుమార్తెకు ఇచ్చిన టికెట్టును వెనక్కి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు తమ అఽధినేతకు వివరించారు.

కేశినేని శ్వేత అభ్యర్థిత్వాన్ని బుద్ధా వెంకన్న, బొండా ఉమా తీవ్రంగా వ్యతిరేకించారు. తన ప్రతిపాదనకు అంగీకరించకపోతే నామినేషన్ ను వెనక్కి తీసుకుంటామని కేశినేని అప్పట్లో చెప్పారు. ఈ సమయంలో కేశినేని నానికి, ఇతర ఇద్దరు నాయకులకు మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది. బహిరంగంగా పరస్పరం విమర్శించుకున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుని తగాదాను తీర్చారు. దాంతో కేశినేని కూతురు శ్వేత అభ్యర్థిత్వానికి ఇతర నాయకులు అంగీకరించారు. 

తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.

దాంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ, అది మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోకపోవడంపై కేశినేని ఇప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుద్ధా వెంకన్న, బొండా ఉమాలపై చంద్రబాబు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసు. ఈ స్థితిలో కేశినేని అసంతృప్తిని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారనేది ప్రశ్న.

click me!