దేవినేని ఉమామహేశ్వర రావు, చింతమనేని ప్రభాకర్, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి వంటి పలువురు సీనియర్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వాటి నుంచి బయటపడడానికే వారికి సమయమంతా సరిపోతోంది. రాష్ట్రంలోని సమస్యలపై పోరాటం చేయడానికి తగిన వ్యవధి కూడా వారికి దోరుకుతున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న లైంగిక, ఇతర దాడులపై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు గాలికి కొట్టుకుపోతున్నాయి.